Suryaa.co.in

Telangana

విద్యార్థులు అత్యున్నత స్థానానికి ఎదగాలి

– ఇంటర్ పరీక్ష ఫలితాల విడుదల సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్: ఉత్తీర్ణులైన ఇంటర్ విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు. ఉత్తీర్ణులైన విద్యార్థులు అత్యున్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నాను, ఉత్తీర్ణులైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు.

జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా ద్వారా ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేయాలని కోరినట్టు వివరించారు.

విద్యారంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. ఎటువంటి పొరపాటు లేకుండా పారదర్శకంగా, విజయవంతంగా ఇంటర్ పరీక్షా ఫలితాల వెల్లడి కార్యక్రమాన్ని నిర్వహించిన అధికార బృందానికి అభినందనలు తెలిపారు.

ఇంటర్ మొదటి సంవత్సరంలో 66.89% మంది తీర్ణత సాధించగా రెండో సంవత్సరంలో 71.37% మంది ఉత్తీర్త సాధించాలని వివరించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 4,88,4430 లక్షల మంది పరీక్షలు రాయగా ఇందులో 73.83 శాతం గర్ల్స్, 57.83%బాయ్స్ ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 5,08,582 మంది పరీక్షలు రాయగా ఇందులో 74.21 శాతం గర్ల్స్ 57.31% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.

LEAVE A RESPONSE