Suryaa.co.in

Andhra Pradesh

రెండేళ్లలో పోయే జగన్ మీటర్లు పెట్టి పోతే ఎలా?

– వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడానికి అంగీకరించకండి
– జగన్ జీవితాంతం జైలు పక్షిగా ఉండాలి
– పులివెందులకు నీళ్ళు ఇచ్చాను…జగన్ కుప్పంకు నీళ్ళు ఆపాడు
-కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో

సీఎం జగన్ జీవితాంతం జైలుపక్షిగా ఉండాల్సిన వ్యక్తి అని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడాన్ని మూకుమ్మడిగా
image-3 వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. తాను జగన్ ఎమ్మెల్యేగా ఉన్న పులివెందులకు నీళ్లిస్తే, జగన్ ఇప్పుడు తన కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఆపేశాడని ధ్వజమెత్తారు. బుధవారం రాత్రి వరకూ కుప్పంలో సాగిన తన పర్యటనలో చంద్రబాబు ఏమన్నారంటే..

నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి.ఎందులో చూసినా బాదుడే బాదుడు. రాని కరెంట్ కు బిల్లుల మోత ఎక్కువ గత నెల కంటే కరెంట్ బిల్లులు డబుల్ అయ్యాయి. కరెంట్ ఇవ్వలేని వాళ్ళు బిల్లు
image లు ఎలా అడుగుతారు? ప్రజా వేదిక కూల్చి జగన్ విధ్వంసానికి నాంది పలికారు. 90 శాతం సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చిన ఘనత టీడీపీది. ఇప్పుడు కుప్పం పై జగన్ కక్ష కట్టాడు.

రాష్ట్రం లో వ్యవసాయ శాఖ అనేది లేదు. ఇప్పుడు పంట దెబ్బతిన్నా ఒక్క అధికారి రాలేదు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడానికి అంగీకరించకండి. రెండేళ్ల లో పోయే జగన్ మీటర్లు పెట్టి పోతే ఎలా? ప్రజల రక్తం తాగే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. జగన్ ఒక జలగలా తయారయ్యాడు…అన్నిటి పై పన్నులతో రక్తం పీల్చుకున్నాడు. 95 శాతం హామీల అమలు ఎక్కడ జరిగిందో జగన్ చెప్పాలి. 8 లక్షల కోట్ల అప్పులకు లెక్కలు లేవు…..మీ అబ్బ సొమ్మా?

పిల్లలను ఇంజనీర్, మెడిసిన్ చదివించాలి అంటే నారాయణ, చైతన్య సంస్థలు గుర్తుకు వస్తాయి. జగన్ రాజకీయ కక్ష తో నారాయణ ను అరెస్ట్ చేశారు. మేము నాడు అనుకుంటే వైసీపీ వాళ్ళు ఉండే వాళ్ళా? మానవత్వం లేని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. నారాయణ కొడుకు వర్ధంతి కార్యక్రమంలో ఉంటే వెళ్లి అరెస్ట్
image-2 చేశారు.60 మంది టీడీపీ ముఖ్య నేతల, ప్రజా ప్రతినిధులపై కేసులు పెట్టారు. టీడీపీకి చెందిన 4 గురు మాజీ మంత్రులను, 6 గురు మాజీ ఎమ్మెల్యే లను అరెస్ట్ చేశారు. అచ్చెన్న, కొల్లు, దేవినేని, నారాయణలను అరెస్ట్ చేశారు.

అమరావతి లో అసలు రింగ్ రోడ్డు లేదు…అసలు రోడ్డే లేని చోట అక్రమం అని కేసు ఏంటి? అన్ని గ్రాఫిక్స్ అని చెప్పిన వాళ్ళు , ఇప్పుడు రింగ్ రోడ్ లో అక్రమాలు అని కేసు పెట్టారు. జగన్ కు బయట తిరిగే అర్హత లేదు…జీవితాంతం జైలు పక్షిగా ఉండాలి.అధికారం వచ్చి 3 ఏళ్లు అయ్యింది…జగన్ ఏమి పీకాడు?88 శాతం పూర్తి అయిన హంద్రీ నీవా పనులు ఎందుకు పూర్తి చెయ్యలేదు.?

నేను పులివెందులకు నీళ్ళు ఇచ్చాను…జగన్ కుప్పంకు నీళ్ళు ఆపాడు. శిశుపాలుడు 100 తప్పులు చేసినట్లు..జగన్ కూడా తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. వ్యవసాయ మోటార్ల కు మీటర్లు పెట్టడం జగన్ చివరి తప్పు అవుతుంది. ఇప్పటికే జగన్ ఎన్నో తప్పులు చేశాడు.మీటర్లు పెట్టకుండా జగన్ ఎదురు తిరగాలి…లేకపోతే ఆ మీటర్లు ఊరితాళ్ళు అవుతాయి.

Ap ని శ్రీలంక కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.రావణుడు చేసిన తప్పుకు నాడు లంకా దహనం అయ్యింది. జనం మేలుకోకపోతే రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేస్తారు గడప గడపకు వచ్చే వైసీపీ ప్రజా ప్రతినిధులను సమస్యలపై నిలదీయండి. మంచి నియోజకవర్గం అయిన కుప్పం లోనూ ధన రాజకీయాలు చేస్తున్నారు. 1000 రూపాయలు ఇచ్చి లక్ష దోచేస్తున్నారు. సంక్షేమం పేరుతో చేపలకు ఎర వేసినట్లు జగన్ ప్రజలకు ఎర వేస్తున్నాడు.

LEAVE A RESPONSE