ఇది ముమ్మాటికీ తెరాస అధికారిక భూకబ్జా

– కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డా దాసోజు శ్రవణ్

ప్రభుత్వం మళ్ళీ వస్తుందో రాదో అనే భయంతో హైదరాబాద్ నడిగడ్డ అయిన ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన బంజారాహిల్స్‌లో 4539 గజాల భూమి అధికారకంగా TRS రాత్రికి రాత్రి కబ్జా చేయడం నేరం. ఇది ముమ్మాటికీ తెరాస అధికారిక భూకబ్జా.

రౌడీలు బెదిరించి భూ కబ్జాలు చేస్తే, TRS పార్టీ మాత్రం తన అధికారాన్ని దుర్వినియోగ పర్చి దొడ్డి దారిని GO లు తెచ్చి ఖరీదైన భూములు కబ్జా చేస్తుండ్రు. రెండు 2పడక గదుల పథకానికి భూములు లేవు. దళితులకు 3 యేకరల పథకానికి భూములు లేవు. కుల సంఘాలకు ఊరు అవుతల వెలి వేసినట్లు భూ కేటాయింపులు , TRSకు మాత్రము 100ల కోట్ల విలువైన భూములు బంజారాహిల్స్ లో.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ భూములన్నీ తెరాస నాయకులూ దోచుకుతిండ్రు.. వేల కోట్ల విలువైన ఫిలింనగర్ భూములను RED FORT కంపెనీ పేరుతో MP రంజిత్ రెడ్డి కి 11 ఎకరాలు కట్టబెట్టిండ్రు . రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు వ్యాపారం కోసం అసైన్డ్ భూములను లాక్కొంటుండ్రు.

స్వాతంత్ర సమరయోధుల భూములను దౌర్జన్యంగా లాక్కొంటుండ్రు. అతి తక్కువ వయస్సు కల టీఆర్ఎస్ ఆస్తీ 816 కోట్లకు యెట్లా చేరింది. . రాష్ట్ర కార్యాలయానికి కూతవేటు దూరంలో జిల్లా కార్యాలయమా… ఎవడబ్బ సొమ్ము ఇది. దానం 10 వేల ఇండ్లు కట్టిస్తా అని గెలిచి, ఒక ఇల్లు కూడా కట్టియ్యలేదు.. ఆయనకు పేదల ఇండ్లకు భూమి దొరకడంలేదు, కానీ టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి మాత్రమే భూమి దొరుకుతుంది వెంటనే తెరాస పార్టీకి అక్రమ కేటాయింపు చేసిన జీవో 47, 11-05-2022 ను వెంటనే రద్దు చేయాలి..ఆ స్థలంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టియ్యాలి

Leave a Reply