అమరావతి : డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై మండలి ఛైర్మనుకు టీడీపీ ఎమ్మెల్సీలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. మండలి నియావళి రూల్ 173 ప్రకారం ఛైర్మనుకు నోటీసులు అందజేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను అసెంబ్లీలో నారాయణ స్వామి దూషించారంటూ టీడీపీ ఎమ్మెల్సీల అభ్యంతరం తెలిపారు. రూల్ 291(ii) నిబంధన పాటించలేదని టీడీపీ ఎమ్మెల్సీలు అన్నారు.