Suryaa.co.in

Andhra Pradesh

మీ సమస్యలు తీరాలంటే టీడీపీ రావాలి

పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పొన్నూరు 14వ వార్డులో టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, జనసేన పార్టీ సమన్వయకర్త వడ్రాణం మార్కండేయులు ప్రచారం నిర్వహించారు. సూపర్‌ 6లోని సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ వివరిం చారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రెండేళ్ల నుంచి పెన్షన్లు ఆపేశారని, అడిగితే మీకు రెండు మీటర్లు ఉన్నాయని చెప్పారని ఓ మహిళ గోడు వెళ్లబోసు కుంది. తాగునీటి కొళాయిలు లేక ఇబ్బందులు పడుతున్నామని చాలా దూరం వెళ్లాల్సి వస్తుందని, గెలిచిన వెంటనే మాకు మున్సిపాలిటీ కొళాయిలు ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపల్‌ నీరు సరిగా రావడం లేదని అందరూ పట్టుకునే లోపే ఆగిపోతున్నాయని వివరించింది. తనకు పెన్షన్‌ తీసేశారని అడిగితే నీ పేరున చాలా ఆస్తులు ఉన్నాయని అంటున్నారని, తన పేరు మీద గజం భూమి కూడా లేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి రుణాలు మంజూరు చేయాలని, ఇంటి స్థలాలు ఇప్పించాలని మరికొందరు కోరారు.

దివ్యాంగులకు మూడు చక్రాల బండ్ల కోసం తిరిగినా పట్టించుకోవటం లేదని, ఇళ్లకు కొంత డబ్బులు చెల్లించి ఉన్నామని, మిగిలినవి చెల్లించడా నికి బ్యాంకు రుణాలు ఇంకా రాలేదు పూర్తిగా చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్‌ చేస్తామని అంటున్నారని లబ్ధిదారులు కోరారు. సైడ్‌ డ్రైన్లు సరిగా లేక మురుగునీరు రోడ్డు మీదకు వస్తుందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయాయని, రేషన్‌ కార్డులు ఇప్పించాలని కోరారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఆయన అధికారంలోకి రాగానే సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, 14వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE