Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీకి ఓటు వేయొద్దని వాలంటీర్‌ బెదిరింపులు

-ససేమిరా అనటంతో దాడి..ఇద్దరికి తీవ్రగాయాలు
-స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం

టీడీపీకి ఓటు వేయొద్దని, వైసీపీకి వేయాలని ఎస్సీ కుటుంబాలను వాలంటీర్‌ బెదిరించి దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలంలో శనివారం రాత్రి జరిగింది. పెదకోదమగుండ్ల పంచాయతీ పరిధిలోని కాకానివారిపాలెంలో ఎస్సీ కుటుంబాలను బెదిరించిన అదే సామాజిక వర్గానికి చెందిన వాలంటీర్‌ వంగల సాగర్‌ వైసీపీకే తప్పనిసరిగా ఓటు వేయాలని కోరాడు. వారు ససేమిరా అనడంతో ఇంట్లోని వస్తువులు ధ్వంసం చేసి ఇద్దరు వ్యక్తులను తీవ్రంగా గాయపరిచాడు. పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

LEAVE A RESPONSE