Suryaa.co.in

Andhra Pradesh

నిజమైన ఓట్లను కాపాడేందుకు టీడీపీ ఎంతదూరమైనా వెళ్తుంది

-రాష్ట్ర ఎన్నికల సంఘం డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలోని అవకతవకలపై, టీడీపీ ఫిర్యాదుల పరిష్కారంపై తక్షణమే దృష్టి పెట్టాలి
• టీడీపీకి పోలయ్యే ఓట్లు.. న్యూట్రల్ ఓట్లు తొలగించడానికి తాడేపల్లి ప్యాలెస్ లో ఒక పెద్ద బృందమే పనిచేస్తోంది
• ఆ బృందం ఆదేశాలతో .. వీఆర్ఏలు, బీ.ఎల్.వోలు, వాలంటీర్లు వారి సొంత ఇళ్లల్లో పెళ్లికి పనిచేసినట్టు ప్రణాళికా బద్ధంగా ఓట్లు తొలగిస్తున్నారు
• కొవ్వూరులో ప్రభావతి అనే వీఆర్ఏ 13 మంది చనిపోయినట్టు ఫామ్-7లు మంజూరు చేసి.. సస్పెండ్ అయ్యింది
• కొన్నిచోట్ల కలెక్టర్లే వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. ఎవరైనా సరే తప్పుచేస్తే భారీమూల్యం చెల్లించుకుంటారు
• డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం రాష్ట్రంలో 4 కోట్ల పైచిలుకు ఓట్లుంటే… 6.50 లక్షల ఓట్లను అదర్ ఎన్ రోల్ మెంట్ కింద చూపారు.. అదర్ ఎన్ రోల్ మెంట్ అంటే ఏమిటో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి
•టీడీపీ ఫిర్యాదులపై, అధికారుల తీరుపై, వైసీపీ ఎమ్మెల్యేల ఆదేశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలి
• ఓటరు జాబితాలో వాలంటీర్లు వేలుపెట్టడాన్ని ఈసీ సీరియస్ గా తీసుకోవాలి.
• నిజమైన ఓట్లు కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎంతదూరమైనా వెళ్తుంది. అవసరమైతే రోడ్డెక్కడానికైనా వెనుకాడదు
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు

అక్టోబర్ 27న ఎన్నికల కమిషన్ వివిధ రాజకీయ పార్టీలకు అందించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం గత ఎన్నికల సమయంలో పోలైన ఓట్లకు అదనంగా 2024లో జరగబోయే ఎన్నికలకు దాదాపు 7లక్షల పైచిలుకు కొత్త ఓట్లు చేరాయని, 2021-22 ఎస్.ఎస్.ఆర్ నోటిఫికేషన్ ప్రకారం మొత్తంగా రాష్ట్రంలో 4కోట్ల7లక్షల మంది ఓటర్లను రిజిస్టర్ చేయడం జరిగిందని, ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలకు అందించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో అనేక అవకతవకలు ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో కొన్ని నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్ బూత్ లకు సంబంధిం చిన ఓటర్ల జాబితాలు లేవు. ఎలక్షన్ కమిషన్ తమకు అందించిన ఓటర్ల జాబితాలో బూత్ ల వారీ ఓటర్ల వివరాలు లేవు. పాడేరు వంటి ఏజెన్సీ ప్రాంతాలలో బూత్ లకు సంబంధించిన వివరాలు లేవు. మరో ప్రధాన అంశం ఏమిటంటే ఓటర్ల జాబితాలో వైసీపీ ప్రభుత్వం భారీ స్థాయిలో జరిపించిన అవకతవకలు. ముఖ్యంగా ఉరవకొండ.. చీరాల.. విశాఖపట్నం నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలోని అర్హులైన ఓటర్లను దారు ణంగా తొలగించారు.

రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న ఫామ్ -7 దరఖాస్తులు .. వాటి ద్వారా జరిగే ఓట్ల తొలగింపుకు సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టడం కోసం జగన్ ప్రభుత్వం తాడేపల్లి ప్యాలెస్ పెద్ద బృందాన్నే నియమించింది. ఏఏ నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లు తొలగించాలి.. తద్వారా వైసీపీ అభ్యర్థుల్ని ఎలా గెలిపించాలనే పక్కా ప్రణాళికలు….వ్యూహాలు అన్నీ తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగానే అమలవుతున్నాయి.

అర్హుల ఓట్లు .. టీడీపీ ఓట్లు తొలగిస్తే తమ గెలుపు తేలికవుతుందనే భ్రమల్లో వైసీపీ ఉంది
ఉరవకొండ నియోజకవర్గంలో 6, 7 వేల ఓట్లు తొలగిస్తే.. సహజంగా అది గెలుపోటము లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలానే చీరాల.. విశాఖపట్నం తూర్పు, పర్చూరు నియోజకవర్గాలపై కూడా దృష్టిపెట్టారు. అవే కాదు..అనేక నియోజకవర్గాలు ప్రభుత్వ జాబితాలో ఉన్నాయి. టీడీపీ ఓట్లు.. న్యూట్రల్ గా ఉండేవారి ఓట్లు తొలగిస్తే తమపార్టీ అభ్యర్థుల గెలుపు తేలికవుతుందనే భ్రమల్లో అధికారపార్టీ ఉంది. చంద్రబాబు అరెస్ట్ .. ఆయన్ని జైలుకు పంపాక వైసీపీ పరిస్థితి దైన్యంగా తయారైంది. వైసీపీ నేతలు.. కా ర్యకర్తలే మా మూర్ఖుడు (జగన్ రెడ్డి) మేంచెప్పేది వినడం లేదు అని వాపోతున్నారు.

ఓట్లను బంగారం కంటే మిన్నగా కాపాడటానికి టీడీపీ ప్రయత్నిస్తోంది
ప్రభుత్వం అర్హుల ఓట్లు తొలగించడం.. దొంగఓట్లు సృష్టించడం చేస్తుంటే..ఆ తంతులో కొందరు అధికారులు నిస్సిగ్గుగా పాలుపంచుకుంటున్నారు. కొన్నిచోట్ల వీ.ఆర్.ఏలు.. ఈ.ఆర్.వోలు, వాలంటీర్లు వారి ఇళ్లల్లో పెళ్లికి పనిచేసినట్టు.. వైసీపీనేతలు..అధికారపా ర్టీ ఎమ్మెల్యేల ఆదేశాలతో ఫామ్ -7ల ద్వారా అడ్డగోలుగా ఓట్లు తొలగిస్తున్నారు. మొన్నటికి మొన్న అనకాపల్లి జిల్లా కొవ్వూరులో వీఆర్ఏ ప్రభావతిని సస్పెండ్ చేశారు.

ఆమె చేసిన అతిపెద్ద తప్పేమిటంటే.. 13 మంది బతికున్నవారిని చనిపోయిన ట్టుగా ఫామ్ -7లు ఇవ్వడం. నియోజకవర్గాల వారీగా వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు ఇలాంటి తప్పులు తమ దృష్టికి వస్తున్నాయి.ఓట్లను కాపాడటానికి.. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల వారీగా చాలా జాగ్రత్తగా ఓటర్లజాబితాను పరిశీలిస్తోంది. బంగారం కంటే మిన్నగా ఓట్లను కాపాడటం కోసం శ్రమిస్తోంది.

అధికారుల చర్యలు.. నిర్ణయాలన్నింటికీ రికార్డులు ఉంటాయని వారు గుర్తించాలి ఎవరైనా సరే తప్పులకు మూల్యం చెల్లించుకోవాల్సిందే
నర్సీపట్నం నియోజకవర్గంలో : 17 వేలఓట్లు… మాడుగులలో : 9,500 ఓట్లు.. పెందుర్తి, యలమంచిలి, పాయకరావు పేట, చోడవరంలలో వాలంటీర్లు ఇష్టానుసారం ప్రజల ఓట్లు తొలగించారు. ఓటర్ జాబితా పరిశీలనలో భాగంగా ఇళ్లకు వెళ్లినప్పుడు ఆ ఇళ్లల్లో ఎవరైనా లేకపోతే వాలంటీర్లు ఎవరూ లేరంటూ ఫామ్ -7 ల ద్వారా ఓట్లు తీసేస్తున్నారు. ఇళ్లల్లోని ఓటర్లు స్థానికంగా లేరనో.. చనిపోయారనో చెబుతూ బూత్ కు ఇన్ని ఓట్లు తీసేయాలనే లక్ష్యంతో వాలంటీర్లు పనిచేస్తున్నారు.

కాకినాడలో వైసీపీనేతలే నేరుగా ఓటర్లజాబితా పరిశీలనలో వేలుపెట్టి.. ఫామ్ -7 దరఖాస్తులు అందించారు. వారిపై ఫిర్యాదు చేయడంతో క్రిమినల్ కేసులు పెట్టారు. అలానే గతంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుపతిలో పోలైన దొంగఓట్లపై పెట్టిన కేసుల్లో ఇంతవరకు ఎలాంటి పురోగతిలేదు. గ్రాడ్యుయేట్లు కాని వారు ఓట్లు వేశారని నిరూపిస్తూ..టీడీపీ ఆధారాలిచ్చినా ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? కొన్నిచోట్ల కలెక్టర్లే వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. ఎవరైనా సరే చేసే తప్పులకు మూల్యం చెల్లించుకుంటారు. ఎలాంటి ఫామ్ లు అందించినా అవన్నీ రికార్డెడ్ అని.. చట్టాలపరంగా తప్పించుకోలేమనే వాస్తవాన్ని అధికారులు గుర్తుం చుకోవాలి.

నిజమైన ఓట్లు కాపాడేందుకు తెలుగుదేశం ఎంతదూరమైనా వెళ్తుంది
డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం రాష్ట్రంలో 4,02,21,450 మంది ఓట్లుంటే…వాటిలో 15 లక్షల ఓట్లు యాడ్ చేస్తే.. 13 లక్షలు తొలగించారు. 6.50 లక్షల ఓట్లను అదర్ ఎన్ రోల్ మెంట్ కింద చూపారు.. అదర్ ఎన్ రోల్ మెంట్ అంటే ఏమిటో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. వేర్వేరు ప్రాంతాల్లో రెండు ఓట్లు ఉంటే.. ఆధార్ సీడింగ్ ప్రొసీజర్ ప్రకారం బీ.ఎల్.వోలు తొలగించే ఓట్లపై కూడా కమిషన్ దృష్టి పెట్టాలి.

టీడీపీ ఫిర్యాదులపై స్పందించి, 0 (సున్నా) డోర్ నెంబర్లు.. తప్పుడు డోర్ నెంబర్లపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి. అలానే వైసీపీ ఎమ్మెల్యేల ఆదేశాలతో ఇష్టానుసారం బూత్ లు కేటాయించడంపై కూడా ఈసీ దృష్టిపెట్టాలి. ఓటరు జాబితాలో వాలంటీర్ల ప్రమేయంపై వేలుపెట్టడాన్ని ఈసీ సీరియస్ గా తీసుకోవాలి. నిజమైన ఓట్లను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎంతదూరమైనా వెళ్తుంది.” అని అశోక్ బాబు తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE