తమ కుటుంబ సభ్యుడినే పొగుడుతున్నట్లు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు సంబరపడ్డారు.. ఇవాళ అమరావతి వేదిక మీద మోడీ గారు నాయుడిని ప్రశంసిస్తుంటే!
ప్రధాని మోదీ టెక్నాలజీ రంగంలో తన పాత్ర గురించి చంద్రబాబు నాయుడు చేసిన ప్రశంసను గుర్తు చేస్తూ.. నేను గుజరాత్ సీఎం అయ్యాక హైదరాబాద్లో ఐటీని ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకున్నా, అధికారులను పంపించి హైదరాబాద్ ఐటీ అభివృద్ధిని అధ్యయనం చేయించా అంటూ ప్రధాని మోదీ హైదరాబాద్ను ఐటీ హబ్గా అభివృద్ధి చేయడంలో చంద్రబాబు నాయుడు చేసిన కృషిని నేరుగా ప్రశంసించారు. నాయుడు మోడల్ను తాను అధ్యయనం చేశానని ఆయన స్పష్టంగా చెప్పారు.
పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా.. త్వరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబుకే సాధ్యం అంటూ ప్రత్యేక సామర్థ్యం కలిగి ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. పెద్దపెద్ద పనులు పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలో లేరు, పెద్ద ప్రాజెక్టులను అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యుత్తమ నాయకుడిగా ప్రధాని మోదీ ప్రశంసించారు.
మూడేళ్లలో అమరావతి పూర్తి చేయాలని చంద్రబాబు సంకల్పించారు అని చంద్రబాబు నాయుడు పెట్టుకున్న ప్రతిష్టాత్మక కాల వ్యవధిని ప్రధాని మోదీ గుర్తించి, హైలైట్ చేశారు.
ప్రధాని మోదీ తన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క దార్శనికత, అనుభవం మరియు పెద్ద ఎత్తున అభివృద్ధి మరియు ప్రాజెక్టుల అమలు సామర్థ్యాన్ని, ముఖ్యంగా హైదరాబాద్లో గతంలో చేసిన కృషిని గుర్తించి, ప్రశంసిస్తుంటే నాయుడు నవ్వుతూ ఆనందించారు.