-వ్యవసాయ శాఖ మంత్రి కోర్టులో దొంగతనం చేసి సీబీఐ చుట్టూ తిరుగుతున్నారు
-సజ్జలదిన్నె నుండి సంకేపల్లి బ్రిడ్జి పూర్తి చేస్తాం
-గండికోట నిర్వాసితులకు చిన్నతరహా పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పిస్తాం
-పరిహారం రాని వాళ్లకు పరిహారం అందిస్తాం
-కడప జిల్లా, జమ్మలమడుగు నియోజకవర్గం, సుద్ధపల్లిలో గండికోట, రాజోలి రిజర్వాయర్ల ముంపు బాధితులు, రైతులతో ముఖాముఖిలో నారా లోకేష్
• ఎన్నికల ముందు జగన్ రైతు రాజ్యం తెస్తానని చెప్పాడు. 108 రోజులుగా సీమలో పాదయాత్ర చేస్తున్నా..కానీ ఇక్కడ రైతులేని రాజ్యంగా కనిపిస్తోంది.
• నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోతున్నామని ఇక్కడి రైతుల చెబితే… కాదు రైతుల తప్పిదాలతోనే వాళ్లు నష్టపోతున్నారని ఎంపీ రిపోర్టులు తయారు చేయించారు.
• మోటార్లకు మీటర్లు పెట్టి రాయలసీమ రైతులకు జగన్ ఉరితాడు బిగించబోతున్నాడు.
• రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడోస్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంది.
• డ్రిప్ కు సబ్సీడీ ఎత్తేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం కూడా అందించడం లేదు.
• పోలవరం, గండికోట, రాజోలి ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందించడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తియ్యని మాటలు చెప్పి మోసం చేశాడు.
• రైతులకు కనీసం ఇప్పుడు ట్రాన్స్ ఫార్మర్లు కూడా ఇవ్వడంలేదు.
• ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు యుద్ధప్రాతిపదికన కల్పిస్తాం.
• 2014లో ఒక్క ఎమ్మెల్యేనే కడప జిల్లాలో టీడీపీని గెలిపించారు. అయినా రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించాము. పులివెందులకు నీళ్లు కూడా అందించాము.
• 2019లో అన్ని స్థానాల్లో వైసీపీని గెలిపించారు..మీ జీవితాలు ఏమైనా మారాయా? సీఎం సొంత జిల్లాలో పనులు కావడం లేదంటే ఆలోచించండి.
• టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సజ్జలదిన్నె నుండి సంకేపల్లి బ్రిడ్జి పూర్తి చేస్తాం.
• 2020లో జగన్ ఇక్కడికి వచ్చి గండికోటలో 26 టీఎంసీల సామర్థ్యం పెట్టడం తన నా అదృష్టం అని జగన్ అన్నారు. బాధితులకు న్యాయం చేస్తానని కూడా హామీ ఇచ్చారు. రూ.200 కోట్లు ఖర్చు చేస్తే మీ సమస్యలు తీరుతాయి.
• రూ.665 కోట్లతో నాడు చంద్రబాబు మీకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించడానికి నిధులు కేటాయించారు.
• ఈ ప్రభుత్వం వచ్చాక రాత్రికి రాత్రి పోలీసులను పెట్టి మిమ్మల్ని ఖాళీ చేయించారు.
• సీఎం సొంత జిల్లాలోనే రైతులకు న్యాయం చేయకపోతే రాష్ట్రంలోని రైతులకు ఏం న్యాయం చేస్తాడు?
• టీడీపీ అధికారంలోకి వచ్చాక న్యాయబద్ధమైన పరిహారం మేము అందిస్తాం. ముంపు కాలనీల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికి మంచి నీటి కుళాయి ఏర్పాటు చేస్తాం.
• గండికోట నిర్వాసితులకు చిన్నతరహా పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పిస్తాం. పాడి రైతులకు గతంలో సబ్సీడీలు ఉండేవి..కానీ ఇప్పుడు దాన్ని ఈ ప్రభుత్వం కూల్చేసింది. టీడీపీ వచ్చాక పాడి రైతులను ప్రోత్సహిస్తాం.
• ఈ ప్రభుత్వం వచ్చాక ఇన్ పుట్ సబ్సీడీ రద్దు చేసింది. పెట్రోల్, డీజల్ ధరలు పెరగడంతో ఎరువులు, విత్తనాల ధరలు పెరిగాయి. పెట్టిన పెట్టుబడి కూడా రైతులకు రావడం లేదు.
• జగన్ కు మతిమరుపు ఎక్కువ. పొద్దున చెప్పింది..సాయంత్రానికి గుర్తు ఉండదు. సీఎం ఒక సభా వేదికగా హామీ ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలి.
• శనగకు రూ.4,800 మద్ధతు ధరతో గతంలో మేము మద్ధతు ధర అందిచాము.
• రాయలసీమ నుండి వెళ్లేలోపు సీమకు ఏం చేయబోతున్నామో వెల్లడిస్తాం. సీమలో మామిడి, టమోటాకు ప్రాసెసింగ్ యూనిట్లు రావాలి.
• గతంలో రూ.70 వేలు ఉన్న రైతు తలసరి అప్పు వైసీపీ ప్రభుత్వం వచ్చాక రూ.2.50లక్షలకు పెరిగింది.
• రాజోలి ప్రాజెక్టు సామర్థ్యం గతంలో 2.9 టీఎంసీలు అని ఇప్పుడు 1.6 టీఎంసీలు అని జగన్ అంటున్నారు. పూటకో మాట మాట్లాడటం వల్ల రైతులు ఇబ్బంది పడతారు. ముంపు వాసులకు పరిహారం రూ.20 లక్షలు ఇవ్వాలన్న దానిపై పార్టీ అధిష్టానంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం.
• టీడీపీ హయాంలో చేతినిండా పని ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రైతుల నుండి వెయ్యి ట్రాక్టర్లు ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారు. గతంలో మీకు ఇచ్చిన సబ్సీడీలు మళ్లీ అమలు చేస్తాం.
• పెద్దాపురంలో లిఫ్ట్ ఇరిగేషన్ పై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. పూర్తి సమాచారం తెలుసుకుని దీనిపై హామీ ఇస్తా.
• వ్యవసాయ శాఖ మంత్రి కోర్టులో దొంగతనం చేసి సీబీఐ చుట్టూ తిరుగుతున్నారు. మంత్రి ఏనాడైనా రైతుల వద్దకు వచ్చారా? వ్యవసాయ శాఖ మంత్రి కనబడటం లేదని బోర్డు పెట్టాలి.
• మామిడి, చీని, దానిమ్మ వంటి హార్టి కల్చర్ పంటలను ప్రోత్సహించాలి. ఉపాధిహామీని గతంలో హార్టి కల్చర్ కు అనుసంధానం చేసే సమయంలో ప్రభుత్వం మారిపోయింది. కొత్త రకాల మామిడి తీసుకురావాలి. మామిడి పరిశోధనాకేంద్రం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
• గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల్లో పరిహారం రాని వాళ్లకు పరిహారం అందిస్తాం.
• ప్రభుత్వం వచ్చాక పల్లెలను పట్టించుకోవడం లేదు. పంచాయతీలను నిర్వీర్యం చేశారు. టీడీపీ హాయంలో వేసిన రోడ్లు, బ్రిడ్జిలే ఇంకా ఉన్నాయి. బుక్కపట్నంను పంచాయతీగా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తాం.