Suryaa.co.in

Telangana

ఇది బీజేపీ విజయం… బాధితుల విజయం

-రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ప్రభుత్వం దిగొచ్చింది
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్

ఎల్బీ నగర్ లో ఏళ్ళ తరబడి పెండింగులో ఉన్న రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నాం.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ప్రభుత్వం దిగొచ్చింది. ఇది బీజేపీ విజయం. బాధితుల విజయం.8 ఏండ్లుగా అక్కడి ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం.

ఎన్నో పోరాటాలు చేశారు. వారికి బీజేపీ అండగా నిలిచింది. నా పాదయాత్ర సమయంలోనూ వారికి సంఘీభావం తెలిపాను. అయినా పట్టించుకోకపోవడంతో ఎంతోమంది చిరు ఉద్యోగాలు చేసుకునే సామాన్యులు అప్పులపాలై అతి తక్కువ ధరకు టీఆరెస్ నేతలకు ఇండ్లు అమ్ముకున్నారు.

రాజగోపాల్ రెడ్డి రాజీనామా దెబ్బకు దిగొచ్చిన కేసీఆర్ ఈరోజు జీవో జారీ చేశారు.బైపోల్ లో టీఆర్ఎస్ ఓటమి భయంతో ఈ జీవో ఇష్యూ చేశారు.ఇంకా కుంటి సాకులు చెప్పకుండా వెంటనే G.O ను అమలు ఎన్నికల తరువాత పెండింగ్ లో పెడితే కేసీఆర్ సర్కారు అంతు చూస్తా. మహోద్యమం చేస్తాం. ఇండ్ల రిజిస్ట్రేషన్ల సమస్యకు పూర్తి పరిష్కారం దొరికే వరకు బాధితులకు బీజేపీ అండగా ఉంటుంది.

LEAVE A RESPONSE