Suryaa.co.in

Telangana

రౌడీ మంత్రిని తక్షణమే కేబినెట్ బర్తరఫ్ చేయాలి

– మే 6న వరంగల్ లో కిసాన్ సంఘర్షణ పోరాట సభ
– కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ప్రెస్ మీట్

ఖమ్మం : మే 6న వరంగల్ పట్టణంలో కిసాన్ సంఘర్షణ పోరాట సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరు అవుతున్నారు.ఖమ్మం మంత్రి గుండాగా మారి, కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.

మంత్రి వేధింపులు తట్టుకోలేక నగరంలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిద్ర పోతున్నడా ?? రౌడీ మంత్రిని తక్షణమే కేబినెట్ బర్తరఫ్ చేయాలి.
ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి అయిన తారక రామారావు అండ చూసుకుని స్థానిక మంత్రి అజయ్ కుమార్ రెచ్చి పోతున్నాడు. బీజేపీ – మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే.. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ సభ్యుల ఆస్తులపై సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలి.

తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త.. రాష్ట్రం వచ్చాక రాబందుల సమితిగా మారింది.. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం మిల్లర్లతో కుమ్మక్కై, వేల కోట్ల రూపాయలను దోపిడీ చేస్తోంది. బీజేపీ – టీఎర్ఎస్ పార్టీలు కుమ్మకై రైతులను హింస పెడుతున్నాయి.

ఢిల్లీ రాజధానిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసింది.. జరిగింది ధర్నా కాదు.. డ్రామా. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రధానమంత్రి మనుషులు హైదరాబాద్ లో ధర్నా చేస్తారు.. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏసీలు, కూలర్లు పెట్టుకుని డ్రామా చేస్తాడు. ఆంధ్ర భవన్ లో మెక్కుతో దొంగ దీక్షలు చేస్తారు. విపరీతంగా ధరలు పెంచుతూ సామాన్యులను హింసకు గురి చేస్తున్నారు.

LEAVE A RESPONSE