– కేటీఆర్
హైదరాబాద్ : అఖిలపక్ష సమావేశ నిర్వహణపై ప్రభుత్వానికి స్పష్టత లేదు. కాంగ్రెస్ పార్టీ వైఖరిపైన వారికే స్పష్టత లేదు.దేశంలో అందరికంటే ముందు డీలిమిటేషన్ వల్ల తెలంగాణకి, దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే నష్టాల గురించి మాట్లాడింది మా పార్టీ.
డీఎంకే పార్టీ కన్నా ముందే చాలా కాలం నుంచి డి లిమిటేషన్ వలన దక్షిణాదికి జరగబోయే నష్టం గురించి జాతీయ వేదికల పైన మాట్లాడుతున్నాము.దేశ ప్రయోజనాల కోసం పాటుపడిన దక్షిణాది రాష్ట్రాలకు డిలిమిటేషన్ విధానం వలన నష్టం జరుగుతుందని చెప్తూ వస్తున్నాము.
డీలిమిటేషన్ పైన జరిగే నష్టాల పైన కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా చెప్తాము. డీలిమిటేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పైన పోరాడుతాం. డీలిమిటేషన్ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి డీలిమిటేషన్ విషయంలో స్పష్టత ఉంది.
డిలిమిటేషన్ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఉన్న బాధ్యత ఏమిటో చెప్పాలి. 22న చెన్నైలో జరిగే డిఎంకె సమావేశానికి హాజరవుతాము. ఈ సమావేశానికి పార్టీ తరఫున నేను హాజరై పార్టీ విధానాన్ని బలంగా వినిపిస్తాము.