Suryaa.co.in

Andhra Pradesh

పులివెందుల పులి కాదు తాడేపల్లి పిల్లి

-సైకో చేతిలో రాష్ట్రం విలవిల
-మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
-అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ కొలికపూడి శ్రీనివాస్ కి సంఘీభావం

నందిగామ (కంచికచర్ల): ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో హైదరాబాద్‌ నుంచి అమరావతికి ‘రాజధాని టు రాజధాని’ పాదయాత్ర చేస్తున్న అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ కొలికపూడి శ్రీనివాస్ కి సోమవారం నాడు మద్దతు తెలిపిన తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య.. కొలికపూడి అభినందించి, సంఘీభావం ప్రకటించారు.

మూడు రాజధానుల పేరిట సీఎం జగన్‌ ఆడుతున్న నాటకాన్ని ఆపాలని, అమరావతి రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను విధ్వంసం చేస్తూ ఆర్‌-5 జోన్‌లో చేస్తున్న నిర్మాణాలు నిలిపివేయాలని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ కొలికపూడి శ్రీనివాసరావు డిమాండ్‌.

34వేల ఎకరాలు 29వేల రైతుకుటుంబాలు రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారు.మహిళలు, దళిత సోదరులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు.తాడేపల్లి కొంప నుండి వెంకటాయపాలెం 6 కిలోమీటర్లు రావడానికి వెళ్లడానికి హెలీకాఫ్టర్ లో వస్తున్నాడు.పులివెందుల పులి కాదు తాడేపల్లి పిల్లి ఎందుకు భయపడుతున్నావ్ జగన్ రెడ్డి.

అమరావతి ప్రజా రాజధానిని విధ్వసం చేసాడు.పరదాలు కట్టుకుని వేల మంది పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజా రాజధాని అమరావతిలో కార్యక్రమం చేస్తున్నాడు అంటే ఇంతకన్నా సిగ్గుందా ?హైకోర్టు తీర్పులు లెక్కలేదు సుప్రీంకోర్టు తీర్పులు లెక్కలేదు .. ధర్మాసనం తీర్పును గౌరవించడం లేదు
ఒక సైకో చేతిలో రాష్ట్రం విలవిలలాడిపోతుంది. బాబాయ్ హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్న జగన్ రెడ్డి కుటుంబం .. సిబిఐ చార్జిషీట్ కొంతమేరకు బయటకు రావడంతో తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు మొదలైంది.

LEAVE A RESPONSE