Suryaa.co.in

Andhra Pradesh

గిరీశా లాంటి అధికారులు ఇంకా ఉన్నారు

• నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఈసీ కఠిన చర్యలు తీసుకునేలా టీడీపీ పోరాడుతుంది
• తిరుపతి ఉపఎన్నికలో నాడు ఆర్వోగా చేసిన తప్పులకు, నేడు కలెక్టర్ గా ఉన్నాకూడా గిరీశా సస్పెండ్ అయ్యాడు.
• నాడు టీడీపీ ఎంతచెప్పినా వినకుండా పెద్దిరెడ్డి అండతో చెలరేగి తప్పులు చేసినందుకు గిరీశాకు ఇప్పుడు శిక్ష పడింది.
• అతనితో పాటు.. మంత్రిపెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను కూడా ఎన్నికల సంఘం శిక్షించాలి.
• మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదుచేసి, వెంటనే విచారణ చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం.
• గిరీశాను సస్పెండ్ చేసినట్టే ప్రతాపరెడ్డి, రిష్వంత్ రెడ్డి, హరినారాయణ, పరమేశ్వర్ రెడ్డిలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నాం
• జగన్ రెడ్డికి మిగిలింది 83 రోజులే.. ఎన్నికలయ్యాక అతను దేశం విడిచి పోతాడు. అతన్ని నమ్మి తప్పులు చేస్తున్న అధికారులు ఎక్కడికి పోతారు?
• జగన్ రెడ్డి అవినీతికి సహకరించినందుకు ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, బీ.పీ.ఆచార్య, రాజగోపాల్, శామ్యూల్ మరికొందరు పడుతున్న బాధలు ఇప్పుడున్న అధికారులు గ్రహిస్తే మంచిది
• టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాలకోసం అధికార యంత్రాంగాన్ని వాడుకుంటున్నాడని, వాస్తవం గ్రహించి నిబంధనల ప్రకారం నడుచుకోకుంటే అధికారులు జైలుపాలవడమో, సస్పెండ్ కావడమో ఖాయమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం…!

“ టీడీపీ ఇచ్చిన ఫిర్యాదు వాస్తవం కాబట్టే ఐఏఎస్ అధికారి గిరీశాను ఎన్నికల సంఘం (ఈసీ) సస్పెండ్ చేసింది. తెలుగుదేశం-జనసేన పార్టీల గెలుపును పసిగట్టే జగన్ రెడ్డి, అధికారులు.. వాలంటీర్ల సాయంతో దొంగఓట్లను నమ్ము కున్నాడు. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ ఏ విధంగా దొంగఓట్లతో గెలిచిందో ప్రజలు చూశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..భూమన కరుణాకర్ రెడ్డి ఆదేశాలు, బెదిరింపులతోనే కొందరు అధికారులు దొంగఓట్లు సృష్టించి, వాటిని వేయించిన వైనాన్ని ఆధారాలతో సహా తెలుగుదేశం ఎన్నికల సంఘం ముందు ఉంచింది.

వైసీపీ ప్రజాప్రతినిధులతో కుమ్మక్కైన అధికారులు తాడేపల్లి ఆదేశాలు పాటిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్న తీరుని టీడీపీ పలుసందర్భాల్లో సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. తిరుపతి ఉపఎన్నికలో 30వేల ఓటర్ గుర్తింపు కార్డుల్ని ఆనాడు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన గిరీశా లాగిన్ ఐడీ నుంచే డౌన్ లోడ్ అయినట్టు నిర్ధారణకు వచ్చాకే, ఎన్నికల సంఘం సదరు అధికారిని సస్పెండ్ చేసింది. గిరీశా లానే జగన్ రెడ్డికి సహకరిస్తూ, అతను చెప్పినట్టు పనిచేస్తున్న మరికొందరు అధికారులపై ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశాం.

ఎన్నికల సంఘం వేటు వేశాక ముఖ్యమంత్రి కూడా కాపాడలేడు
ఎన్నికల సంఘం ఏ అధికారిని సస్పెండ్ చేసినా.. వారికి ముఖ్యమంత్రి కూడా తిరిగి పోస్టింగ్ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పక్ష పాతం లేకుండా చట్టప్రకారం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సూచిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని నమ్మి, అతని అవినీతిలో భాగస్వాములైన శ్రీలక్ష్మి, బీ.పీ.ఆచా ర్య, రాజగోపాల్, శామ్యూల్ వంటి ఐఏఎస్ అధికారులు ఇస్పటికీ కోర్టులచుట్టూ తిరుగుతు న్నారు. కళ్లముందు కొందరు అధికారులు పడుతున్న బాధలు చూస్తూ కూడా పోస్టింగులు, ప్రమోషన్లకోసం, ఇతరత్రా ప్రలోభాలకు లొంగి తప్పులుచేస్తే అధికారులు భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఎన్నికలు ముగిశా క జగన్ రెడ్డి ఏ దేశమో, వేరే రాష్ట్రానికో పారిపోతాడు. తప్పుచేసిన అధికారులు ఎక్కడికి పోతారు?

కులపిచ్చితో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే ప్రతి అధికారి సస్పెండ్ కావడమో… జైలుకెళ్లడమో ఖాయం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనంతపురం ఆర్జేడీగా ఉన్న ప్రతాపరెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ కల్పనా రెడ్డి భర్త. అతను ఒళ్లూ..పై తెలియకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డాడు. గిరీశాపై ఫిర్యాదు చేసినట్టే టీడీపీ ఎప్పుడో ప్రతాప రెడ్డిపై కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తిరుపతి కలెక్టర్ వెంకట రామిరెడ్డి, చిత్తూరు కలెక్టర్ హరినారాయణపై, తిరుపతి ఆర్డీవో కనక నర్సారెడ్డి, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిపై కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశాం. చిత్తూరు ఎస్పీ రిష్వంత్ రెడ్డి కూడా లిస్ట్ లో ఉన్నాడు. ఇతనైతే మరీ ఖాకీ చొక్కా లోపల వైసీపీ కండువా ఉన్నట్టే విధినిర్వహణ చేస్తున్నాడు. మున్సిపల్ కమిషనర్ గా తిరుపతిలో పనిచేసినప్పుడు గిరీశా చేసిన తప్పులకు నేడు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా ఉన్నాకూడా సస్పెండ్ అయ్యాడు. ప్రతాపరెడ్డి ఈ వాస్తవం గ్రహిస్తే మంచిది. తప్పుచేసిన అధికారులు ఎవరూ తప్పించుకోలేరు. కులపిచ్చితో విధినిర్వహణకు విరుద్ధంగా ప్రవర్తించే ప్రతి అధికారి, కచ్చితంగా వారంతా సస్పెండ్ కావడమో…జైలుకెళ్లడమో ఖాయం. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ అధికారి ఇంతగా బరితెగించి అధికార దుర్విని యోగానికి పాల్పడలేదు. రెచ్చిపోయి కులపిచ్చితో ఇష్టానుసారం ప్రవర్తిం చలేదు.

ప్రతాపరెడ్డి, రిష్వంత్ రెడ్డి, హరినారాయణ, పరమేశ్వర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ మరో పదిరోజుల్లో రానుంది. జగన్ రెడ్డి చెప్పాడని ఇష్టానుసారం ప్రవర్తించే ఏ అధికారి అయినా శిక్షార్హుడే. పిచ్చపిచ్చ వేషాలు వేసే అధికారులు సర్వీస్ నుంచి రిమూవ్ కావడం.. సర్వీస్ పై మాయనిమచ్చ అంటిం చుకోవడం కూడా ఖాయం. సచివాలయ ఉద్యోగుల సంఘం వెంకట్రామిరెడ్డిని కూడా ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం. గిరీశాపై చర్యలు తీసుకున్నట్టే, ప్రతాపరెడ్డి, రిష్వంత్ రెడ్డి, హరినారాయణ, పరమేశ్వర్ రెడ్డిలపై కూడా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నాం. వారు చేసిన తప్పులు..వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా ఎన్నికల సంఘం ముందు ఉంచబోతున్నాం. జగన్ రెడ్డి అండతో అధికారులు చేసిన తప్పులకు అంతేలేదు. 5వ తరగతి చదివిన తిరుపతి కౌన్సిలర్ కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు.

గిరీశాను ఒక్కడినే సస్పెండ్ చేస్తే సరిపోదు.. అతనితో తప్పులుచేయించిన మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అతని కొడుకుపై కూడా చర్యలు తీసుకోవాలి
ప్రజల ఛీత్కారం తప్పదని గ్రహించే జగన్ రెడ్డి కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి, దొంగఓట్ల ద్వారా గెలవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యమంత్రికి అండతో తప్పులుచేసే అధికారులు కచ్చితంగా శిక్షింపబడతారు. ఐఏఎస్ అధికారి గిరీశాపై చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, అతని కుమారుడిపై కూడా కఠినచర్యలు తీసుకోవాలి. ఈ ముగ్గురిపై క్రిమినల్ కేసులు పెట్టి, అదుపులోకి తీసుకొని విచారించాలి. గిరీశా అనే అధికారి ఒక్కడే తప్పు చేశాడని చెప్పలేం. అతన్ని వేధించి, ప్రలోభపెట్టి తామనుకున్నది చేసిన పెద్దిరెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా ఎన్నికల సంఘం కఠినంగా శిక్షించాలి.

నియోజవకర్గాల వారీగా టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి, మరికొందరు అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సి ఉంది
అలానే ఉరవకొండ నియోజకవర్గంలోని దొంగఓట్ల అక్రమా లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. అక్కడ ఒక ఆర్డీవోను, ఎమ్మార్వోను సస్పెండ్ చేశారు. ఇంకా కొందరు అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. పర్చూరు నియోజకవర్గంలో గంపగుత్తగా ఫామ్-7 దరఖాస్తులు అప్ లోడ్ చేసి, దాదాపు 12వేల టీడీపీ ఓట్లను తొలగించారు. ఆ ఘటనకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఒక సీఐని, ఒక ఎస్పీని మాత్రమే సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో ప్రమేయమున్న మరికొందరు అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 17వేల దొంగఓట్లు చేర్చారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు10వేల వరకు తొలగించారు.

పిఠాపురం నియోజకవర్గంలో 28 బూత్ లలో నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు తొలగించారు. కావలిలో ఒకే పోలింగ్ బూత్ పరిధిలోని 500 ఓట్లను తొలగించారు. కాకినాడలో కూడా నిబంధనలకు విరుద్ధంగా అర్హుల ఓట్లు తొలగించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన తప్పులు.. తమ దృష్టికి వచ్చిన అనేక ఘటనలపై 10-03-2023న ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాం. తర్వాత కూడా అనేక ఫిర్యాదులు అందించాం. జగన్ రెడ్డి అతని పంచన ఉండే దొంగల్ని నమ్మి జీవితాలు పాడుచేసుకోవద్దని అధికారుల్ని హెచ్చరిస్తున్నాం.

విలేకరుల ప్రశ్నలకు బొండా ఉమా స్పందన…
83 రోజుల తర్వాత జగన్ రెడ్డి సహా ఎవరూ కనిపించరు కొడాలినానీ వేస్ట్ ఫెలో. అతను ఫ్రస్టేషన్లో ఉండి నోరు పారేసుకుంటున్నాడు. నిన్న గుడివాడలో జరిగిన టీడీపీ ‘రా..కదలిరా’ సభకు లక్షకు పైగా జనం వచ్చారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీ బలం చూడలేని దుస్థితిలో కొడాలి నానీ ఉన్నాడు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు నానీకి ఇంకా అధికారం తాలూకా అహంకారపు పొరలు తొలగిపోలేదు. అందుకే టీడీపీ సభకు జనం రాలేదంటున్నాడు. నానీ లాగా ఎవడు ఎంతగా రెచ్చిపోయినా ఇంకా వాళ్లకు మిగిలింది 83 రోజులే. తర్వాత జగన్ రెడ్డి.. పెద్దిరెడ్డి… సజ్జల సహా ఏ ఒక్కరూ కనిపించరు.” అని బొండా ఉమా స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE