Suryaa.co.in

Telangana

కాంగ్రెస్‌, బిజెపిల దుష్ప‌రిపాల‌న వ‌ల్లే ఈ దుష్ప్ర‌భావాలు!

-కేంద్రంలో పొగ‌డ్త‌లు! రాష్ట్రానికి వ‌చ్చే స‌రికి తెగ‌డ్త‌లు!!
-రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాలు దేశంలో ఎక్క‌డైనా ఉన్నాయా?
-రైతుల‌కు ఇంత‌గా మేలు చేస్తున్న ప్ర‌భుత్వం ఎక్క‌డా లేదు
-కెసిఆర్ లాగా ఎవ‌రూ ప్ర‌జా సంక్షేమాన్ని, అభివృద్ధిని ప‌ట్టించుకున్న పాపాన పోలేదు
-ఇంత గొప్ప ప‌రిపాల‌న నా 40 ఏండ్ల రాజ‌కీయ జీవితంలో చూడ‌లేదు
-ప్ర‌జ‌లు విశ్లేషించుకోవాలి… మంచిని అభినందించాలి
-బిజెపి వైఖ‌రిని తిప్పి కొట్టాలి… గ్రామాల్లో నిల‌దీయాలి
-పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం పెద్ద వంగ‌ర ఆత్మీయ స‌మ్మేళ‌నాల్లో ప్ర‌జ‌ల‌కు, పార్టీ శ్రేణుల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు
-దేశానికి ఆద‌ర్శంగా తెలంగాణ రాష్ట్రం
-రాష్ట్రానికి ఆద‌ర్శంగా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం
-పాలకుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో విశేష అభివృద్ధి
-అద్బుతంగా జ‌రుగుతున్న ఆత్మీయ స‌మ్మేళ‌నాలు
-పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అదృష్ట వంతులు
-ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు కి అభినంద‌న‌లు ః క‌డియం శ్రీ‌హ‌రి
-పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం పెద్ద వంగ‌ర ఆత్మీయ స‌మ్మేళ‌నాల్లో ప్ర‌జ‌ల‌కు, పార్టీ శ్రేణుల‌కు మాజీ ఉప ముఖ్య‌మంత్రి, ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి విశ్లేష‌ణ‌

పెద్ద వంగ‌ర , మే 26ః ఈ దేశాన్ని సుదీర్థ కాలంగా ప‌రిపాలించిన కాంగ్రెస్‌, ఇప్పుడు పాలిస్తున్న‌ బిజెపిల దుష్ప‌రిపాల‌న వ‌ల్లే ఈ దుష్ప్ర‌భావాలు ఏర్ప‌డ్డాయ‌ని, దేశం, రాష్ట్రాలు ఏళ్ళ‌కు ఏళ్ళు వెనుక‌బ‌డి పోయాయ‌ని, అందుకే సీఎం కెసిఆర్ లాంటి ప‌రిపాల‌నా ద‌క్షుల అవ‌స‌రం దేశానికి, రాష్ట్రానికి ఏర్ప‌డింద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు.

కేంద్రంలో మ‌న రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాల‌పై పొగ‌డ్త‌లు గుప్పించి, రాష్ట్రానికి వ‌చ్చే స‌రికి విమ‌ర్శ‌లు చేస్తూ, సీఎం కెసిఆర్‌ను, ఆయ‌న పాల‌న‌ను తిడుతున్నారు. బిజెపి వైఖ‌రిని తిప్పి కొట్టాలి. గ్రామాల‌కు వ‌చ్చే ఆ పార్టీల నాయ‌కుల‌ను నిల‌దీయాలి. వారి విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొట్టాలి. అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌జ‌ల‌కు పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.

మ‌హ‌బూబాబాద్‌ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పెద్ద‌వంగ‌ర‌ మండలం చిట్యాల‌, బొమ్మ‌క‌ల్‌ గ్రామాల‌కు క‌లిపి, పెద్ద‌వ‌రంగ‌లో, గంట్ల‌కుంట‌, పోచంప‌ల్లి, అవుతాపురం గ్రామాల‌కు క‌లిపి పోచంప‌ల్లి క్రాస్ రోడ్డులో శుక్ర‌వారం జ‌రిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ ఉప ముఖ్య‌మంత్రి, ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి విశిష్ట అతిథిగా ప్ర‌సంగించారు.

మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్‌, ఇటీవ‌లి 10 ఏండ్లు, అంత‌కుముందు కొద్దికాలంపాటు బిజెపిలు దేశాన్ని పాలిస్తున్నాయి. కానీ, ఆదేశంలో ఆక‌లి, దుర్భిక్షం పోక‌పోగా, మ‌రింత ఎక్కువ అయ్యాయ‌ని అన్నారు. అందుకే దేశం యావ‌త్తు సిఎం కెసిఆర్ రాక కోసం, దేశానికి కావాల్సింది గుజ‌రాత్ మోడ‌ల్ కాదు, తెలంగాణ మోడ‌ల్ కావాల‌ని దేశ ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని ఆయ‌న తెలిపారు. రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాలు దేశంలో ఎక్క‌డైనా ఉన్నాయా? అని ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు. అలాగే, రైతుల‌కు ఇంత‌గా మేలు చేస్తున్న ప్ర‌భుత్వం ఎక్క‌డా లేదు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన య‌వుసం ఎక్క‌డా బాగుప‌డ‌లేద‌ని, అందుకే దేశంలో ఇన్ని స‌మ‌స్య‌లున్నాయ‌ని చెప్పారు.

దేశంలో కెసిఆర్ లాగా ఎవ‌రూ ప్ర‌జా సంక్షేమాన్ని, అభివృద్ధిని ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. కెసిఆర్ చేస్తున్న‌టువంటి ఇంత గొప్ప ప‌రిపాల‌న నా 40 ఏండ్ల రాజ‌కీయ జీవితంలో చూడ‌లేదు. ప్ర‌జ‌లు విశ్లేషించుకోవాలి… మంచిని అభినందించాలి. స్వాగ‌తించాలి. ఆశీర్వ‌దించాలి. చెడుని తిర‌స్క‌రించాలి. కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని అభినందిస్తున్న‌ది. పార్ల‌మెంట్ సాక్షిగా పొడుతున్న‌ది. అవార్డులు ఇచ్చి త‌స్క‌రిస్తున్న‌ది. రాష్ట్రానికి వ‌చ్చే స‌రికి తిడుతున్న‌ది. విమ‌ర్శ‌లు చేస్తున్న‌ది. బిజెపి ద్వంద్వ వైఖ‌రిని తిప్పి కొట్టాలి.

ఆ పార్టీ నేత‌లు గ్రామాల్లోకి వ‌స్తే నిల‌దీయాలి అని మంత్రి ఎర్ర‌బెల్లి ప్ర‌జ‌ల‌కు, పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అమ‌లు అవుతున్న ప‌లు అభివృద్ధి పథ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు, పార్టీ శ్రేణుల‌కు సోదాహ‌ర‌ణంగా వివ‌రించారు. తాను నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాన‌ని, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను క‌డుపులో పెట్టుకుని చూస్తున్న‌ద‌ని, ప్ర‌జ‌లు సీఎం కెసిఆర్ కి అండ‌గా నిలవాల‌ని, సీఎం కెసిఆర్ ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటార‌ని మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు.

మాజీ ఉప ముఖ్య‌మంత్రి, ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ పాల‌న వ‌ల్ల దేశానికి ఆద‌ర్శంగా తెలంగాణ రాష్ట్రం త‌యారైంది. అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్ర‌గామిగా నిలిచింది. అభివృద్ధి, సంక్షేమాల్లో ముందున్న తెలంగాణ‌ను చూసి దేశం నేర్చుకుంటున్న‌ది. ఇంత గొప్ప‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘ‌న‌త మ‌న సీఎం కెసిఆర్ గారికే ద‌క్కుతుంద‌ని అన్నారు.

అయితే, కాంగ్రెస్‌, బిజెపి లు రాష్ట్రంలో కెసిఆర్‌పాల‌న చూసి, దేశానికి ఆయ‌న నాయ‌క‌త్వం అవ‌స‌ర‌మున్న నేప‌థ్యంలో ఆయ‌న్ని దేశ రాజ‌కీయాల్లోకి రాకుండా అడ్డుకోవ‌డానికే అడ్డ‌గోలుగా విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. కేంద్రంలో బిజెపి ప్ర‌భుత్వం స‌హ‌క‌రించుకున్నా, సీఎం కెసిఆర్ ఇంత‌గా అభివృద్ధి చేస్తున్నార‌ని తెలిపారు. తెలంగాణ‌లో అమ‌లు అవుతున్న ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను క‌డియం ప్ర‌జ‌ల‌కు, పార్టీ శ్రేణుల‌కు వివ‌రించారు.

దేశానికి ఆద‌ర్శంగా తెలంగాణ రాష్ట్రం, రాష్ట్రానికి ఆద‌ర్శంగా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం ఉన్నాయ‌ని క‌డియం అభినందించారు. పాలకుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన‌ విశేష అభివృద్ధిని చూస్తుంటే ఈర్ష్య‌గా ఉంది. పాల‌కుర్తిలో అద్బుతంగా జ‌రుగుతున్న ఆత్మీయ స‌మ్మేళ‌నాలు, మ‌రెక్క‌డా జ‌ర‌గ‌డం లేదు. ఇన్ని రోజులుగా కొన‌సాగ‌డం లేదు. ప్ర‌జ‌ల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి మంచి ఆద‌ర‌ణ పొందుతూ, అభివృద్ధిని కొన‌సాగిస్తున్న మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావును అభినందిస్తున్నాను. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అదృష్ట వంతులు వారికి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాన‌ని చెప్పారు.

అంత‌కుముందు ఈ ఆత్మీయ‌ స‌మ్మేళ‌నంలో సిఎం కెసిఆర్ సందేశాన్ని చ‌దివి వినిపించారు. ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు చైర్ ప‌ర్స‌న్ ఎర్ర‌బెల్లి ఉషా ద‌యాక‌ర్‌రావు పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన అభివృద్ధి క‌ళ్ళ‌కు క‌డుతున్న‌ది. ఇంత‌గా ఎప్పుడూ అభివృద్ధి జ‌ర‌గ‌లేదు. ఇటు నియోజ‌క‌వ‌ర్గంలో ద‌య‌న్న‌ను, అటు రాష్ట్రంలో సీఎం కెసిఆర్ ను కాపాడుకుంటేనే, వారు ప్ర‌జ‌ల‌ను కాపాడ‌గ‌లుగుతార‌ని, ప్ర‌జ‌లు వారికి అండ‌గా నిల‌వాల‌ని కోరారు.

కాగా, ఆత్మీయ స‌మ్మేళ‌నాల ప్రాధాన్యాన్ని పార్టీ శ్రేణుల‌కు వివ‌రించారు. కార్య‌క‌ర్త‌ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకునే పార్టీ బిఆర్ ఎస్ మాత్ర‌మేన‌ని, తాను కూడా కార్య‌క‌ర్త‌ల‌ను కాపాడుకుంటాన‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు తెలిపారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి మంత్రి భోజ‌నాలు చేశారు. వారికి వ‌డ్డించారు. అంద‌రినీ ప‌ల‌క‌రిస్తూ, కుశ‌ల ప్ర‌శ్న‌లు వేస్తూ మంత్రి సంద‌డి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ ముఖ్య నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు, ప‌లువురు ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE