– ఇది తెలంగాణ ప్రభుత్వ విజయం
– మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కుల గణన రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరిగి చట్టం చేసి 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసి పంపింది. కేంద్ర ప్రభుత్వం బీసీ లకు తెలంగాణ లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని డిమాండ్ చేశాం. కుల గణన చేసి తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారింది.
ఇప్పుడే కేంద్ర ప్రభుత్వ జన గణన ద్వారా జనాభా లెక్కల్లో కుల గణన చేస్తామని ప్రకటించింది. ఇది తెలంగాణ ప్రభుత్వ విజయం. తెలంగాణ ప్రజల విజయం. 1931 లో బ్రిటిష్ కాలంలో జాతీయ స్థాయిలో కుల గణన జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ విజయం సహకరించిన ముఖ్యమంత్రి కి ,ఉప ముఖ్యమంత్రి కి సహచర మంత్రులకు ,పార్టీ కి ధన్యవాదాలు.
ఆలస్యమైన చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. రాబోయే జన గణన లో కుల గణన చేస్తామని చెప్పడం బలహీన వర్గాల మంత్రిగా మీకు అభినందనలు కృతజ్ఞతలు.