Suryaa.co.in

Telangana

పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తా

– బీజేపీ ఎంపీ రఘునందన్ రావు

హైదరాబాద్: తల్లి, అక్క, చెల్లి మధ్య ఉండే సంబంధం గురించి బీఆర్‌ఎస్ సోషల్ మీడియా సంస్కారహీనంగా పోస్టులు పెట్టారు.ఒక అక్కకు తమ్ముడిగా ఆమెను అడిగి మరీ నూలు పోగు దండ వేశా. అలాంటి నూలు పోగు దండను ప్రధాని మోడీ వచ్చినప్పుడు కూడా వేశా. అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను.

అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్త. పోస్టు పెట్టిన అకౌంట్ డిపి హరీష్ రావు ఫోటో,కేసీఆర్ ఫోటో ఉంది. బీఆర్‌ఎస్ కు సోషల్ మీడియా మీద నియంత్రణ లేదా.? పోస్టులు పెట్టిన వారు మీ వాళ్ళు అయితే తీసుకొచ్చి పోలీసులకి అప్పగించండి.

మీకు సంబంధం లేని, మీరు జీతం ఇవ్వని వ్యక్తులు అయితే వచ్చి మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి. మెదక్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా సురేఖ అక్క వస్తే చేనేత సమస్యలు ఆమె దృష్టికి తీసుకెళ్లేలా నూలు పోగు దండ అడిగి వేశా.బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే వచ్చి నాకు శాలువా కప్పారు. ఇంత సంస్కారహీనంగా, సభ్యత లేకుండా మాట్లాడతారు అనుకోలేదు.

కేటీఆర్, హరీష్ రావు దీనిపై స్పందించి సోషల్ మీడియా ను కంట్రోల్ చేసుకుని క్షమాపణ చెప్పాలి. హరీష్ రావు ఫోటోలు వాడుకుంటున్నారు అనుకుంటే పోలీసు కంప్లయింట్ ఇవ్వండి.వ్యక్తుల వ్యక్తిత్వ హననం చేయడం మంచిది కాదు. మహిళల మీద బీఆర్‌ఎస్ కు గౌరవం లేదు. తెలంగాణ తొలి కేబినెట్ లో మహిళలకు చోటు ఇవ్వలేదు. నా వల్ల మా అక్కకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నా.

LEAVE A RESPONSE