Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ ఆఫీసుపై దాడికి టీటీడీపీ నేతల నిరసన

ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై వైసిపి గుండాలు దాడి చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో మాదకద్రవ్యాలు .గంజాయి మత్తు పదార్థాలు సరఫరా కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు, టిడిపి నాయకుల ఇండ్లపై పార్టీ కార్యాలయంపై దాడి చేయడం దుర్మార్గం అన్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు, గంజాయి మత్తు పదార్థాల స్మగ్లింగ్ జరుగుతుంటే అరికట్టాల్సిన జగన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని విమర్శించారు .ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి పోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిపై, వైసీపీ ప్రభుత్వం పోలీసుల సమక్షంలోనే గుండాల తో వైసీపీ కలిసి దాడి చేస్తున్నారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని. జగన్ ప్రభుత్వ అరాచకాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ బలగాలతో రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE