Suryaa.co.in

Telangana

ఎంపీ వద్దిరాజుకు అమెరికా ఆహ్వానం

హైదరాబాద్: గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ ఏడాది ఆగస్టులో అమెరికాలో జరిగే మహాసభకు ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను ఆహ్వానించారు. ఎంపీ రవిచంద్రను అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు, కన్వీనర్ సంగని రజనీకాంత్ పటేల్ ,మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్,మున్నూరుకాపు జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్ తదితరులు శుక్రవారం మధ్యాహ్నం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో నివసిస్తున్న, స్థిరపడిన మున్నూరుకాపు ప్రముఖులందరిని ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు గాను ఈ ఏడాది ఆగస్టు 30,31వ తేదీలలో అమెరికాలోని లీస్ బర్గులో మహాసభ నిర్వహిస్తున్నట్లు రజనీకాంత్ తెలిపారు.లీస్ బర్గ్ వీఏ 20176,లైమ్ స్టోన్ స్కూల్ రోడ్డులో ఉన్న ద్రోమవాళ్ల ఫామ్ 14980లో జరిగే మహాసభ సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు,పలు అంశాలపై చర్చించనున్నామని రజనీకాంత్ ఎంపీ వద్దిరాజుకు వివరించారు.

LEAVE A RESPONSE