Suryaa.co.in

Andhra Pradesh

చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో ఘనంగా వాసవి అమ్మవారి శాకాంబరీ అలంకరణ వేడుకలు

-శాకాంబరీ అలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీ వాసవి అమ్మవారు
-ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీమంత్రి శిద్దా రాఘవరావు దంపతులు
-వాసవి మహిళలతో కలసి అమ్మవారికి పూజలు నిర్వహించిన శిద్దా రాఘవరావు సతీమణి లక్ష్మీ పద్మావతి

ఆషాఢమాసం శుక్రవారం పునస్కరించుకొని చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి అమ్మవారికి శాకాంబరీ అలంకరణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మాజీమంత్రి శిద్దా రాఘవరావు దంపతులు,శిద్దా పాండురంగారావు సుధావళి దంపతులు క్షేత్రంలో కొలువై ఉన్న సకల దేవతలను దర్శించుకున్నారు. శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి వాసవి అమ్మవారి ఆశిస్సులు అందుకున్నారు.

శాకంబరీ అలంకరణ సందర్భంగా శ్రీ వాసవి అమ్మవారికి ప్రాతకాలంలో పంచామృత అభిషేకం, విశేష కుంకుమ అర్చన,అలంకారాలతో అమ్మవారికి 41 రకాల కూరగాయలు, పండ్లు,ఆకుకూరలు,వైవిధ్య పుష్పాలతో అలంకరించారు.శాకాంబరీ అలంకరణతో వాసవి అమ్మవారు నయిన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. అమ్మవారిని శాకాంబరీ అమ్మవారి అలంకరణ తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంతో పూజలు నిర్వహించారు.

అనంతరం శిద్దా లక్ష్మీ పద్మావతి, మహిళలతో కలసి అమ్మవారి భక్తి పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.అమ్మవారి దర్శనం కోసం మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శిద్దా వెంకటేశ్వర్లు శ్రీమతి వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం ఆందచేశారు.

ఈ కార్యక్రమంలో శిద్దా సుధాకర్ దంపతులు, శిద్దా కుటుంబ సభ్యులు, శిద్దా జయశ్రీ, శిద్దా జయభారతి లక్ష్మీ,శిద్దా శిరీష తదితరులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ,హరి కుమారా చార్యులు, హరికృష్ణ శర్మ,భక్తులకు తీర్థప్రసాదాలు అందచేశారు. ఆలయ ఇంచార్జ్ ఎమ్.వెంకటేశ్వర్లు కార్యక్రమ పర్యవేక్షణ నిర్వహించారు.

LEAVE A RESPONSE