Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ నూతన గవర్నర్ తో విజయసాయిరెడ్డి భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైన జస్టీస్ అబ్దుల్ నజీర్ ను రాజ్యసభ సభ్యులు వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి న్యూఢిల్లీలో ఆయన నివాసంలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. న్యాయ వ్యవస్థలో ఆయనకున్న అపారమైన అనుభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో మేలు కలగజేస్తుందని, ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నట్లు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా సేవలందించిన విశ్వభూషన్ హరిచందన్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అపార అనభవం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి ఎంతో మేలు కలగజేస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు.

LEAVE A RESPONSE