Suryaa.co.in

Telangana

దుబారా ఖర్చులు అన్నీ ఆపేశాము

– రూపాయి రూపాయి పోగేసి ప్రజా సంక్షేమం చేపట్టాము
– ఎంతో జాగ్రత్త గా ప్రతి రూపాయి ఖర్చు చేస్తున్నాము
– ఫామ్ హౌస్ లో పడుకున్న వారు ప్రేలాపనలు చేస్తున్నారు
– ఖమ్మం మెడికల్ కాలేజీ భవన శంకుస్థాపన సభ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఖమ్మం: పదేళ్లు పాలనను గాలికి వదిలేశారు. రాష్ట్ర ఉద్యోగుల అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం ముందు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఏడు లక్షల కోట్ల అప్పుచేసిన గత పాలకులు ఏ నాడు ఉద్యోగులకు మొదటి తారీకున జీతాలు ఇవ్వలేదు.

ఖమ్మం మెడికల్ కళాశాల భవన నిర్మాణాల కు శంకుస్థాపన చేయటం సంతోషం. ప్రభుత్వ మెడికల్ కళాశాల ద్వారా పేదలకు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం దొరల కోసమో పాలకుల కోసమో పని చేసే ప్రభుత్వం కాదు.

కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్యానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. పది సంవత్సరాలు బిఆర్ ఎస్ ప్రభుత్వం వైద్య రంగానికి 5950 కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒక్క ఏడాది లో 11482 కోట్లు ఖర్చు చేసింది.

వరంగల్ లో సభ పెట్టి అడ్డగోలు మాటలు మాట్లాడిన వారికి ఈ లెక్కలు తెలియాలని చెబుతున్న. 90 లక్షల కుటుంబాల కు 10 లక్షల వరకూ లబ్ధి చేకూర్చి వైద్యం అందించాము. గత ప్రభుత్వం గాలికి వదిలేస్తే, రాజీవ్ ఆరోగ్య శ్రీ పెండింగ్ బిల్లులు అన్నీ క్లియర్ చేస్తున్నాము. రాష్ట్రం లో బిర్ ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిన వైద్య రంగానాని గాడిన పెడుతున్నాము.

బిఆర్ఎస్ ప్రభుత్వం లో నిర్లక్ష్యానికి గురైన విద్యా రంగానికి ప్రత్యేకం గా నిధులు కేటాయించాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటేడ్ పాఠశాలల నిర్మాణం జరుగుతోంది. రాష్ట్రం లో రైతాంగానికి అండగా నిలిచి రుణమాఫీ చేశాము. నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందజేస్తున్నాము. ఖమ్మం జిల్లా లో సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తున్నాము.

9 వేల కోట్లుతో రాజీవ్ యువ వికాసంతో యువత నిరుద్యోగులను ఆదుకుంటున్నాము. రూపాయి రూపాయి పోగేసి ప్రజా సంక్షేమం చేపట్టాము. దుబారా ఖర్చులు అన్నీ ఆపేశాము ఎంతో జాగ్రత్త గా ప్రతి రూపాయి ఖర్చు చేస్తున్నాము. మీరు చేసిన అప్పుల కు 6 వేల కోట్లు నెల నెలా బ్యాంకు లకు వడ్డీ కడుతున్నాము.

రాష్ట్ర ప్రభుత్వంలో పని చేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అందజేసినట్టే ఉద్యోగుల ను కాపాడుకుంటాము. ముఖ్య మంత్రి రేవంత్ ఉద్యోగుల ను అభ్యర్దించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ది పరిస్థితిని అర్దం చేసుకోమని విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE