Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర ప్రభుత్వ దోపిడీని చార్జిషీట్ల రూపంలో ప్రజలకు వివరిస్తాం

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్, విష్ణువర్థన్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ దోపిడీని చార్జిషీట్ల రూపంలో ప్రజలకు వివరిస్తాం. 4మే 5 నుంచి ప్రజా చార్జ్ షీట్ల కార్యక్రమం నిర్వహిస్తాం. వైసీపీ నేతలు సహజ వనరులను దోచుకోవటంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. రాష్ట్రాన్ని మరింత అప్పుల మయం. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా మోసం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేశారు. కేంద్రం ఇచ్చే పథకాలు అందిపుచ్చుకునే పరిస్థితి లేదు.

ప్రభుత్వ వైఫల్యాలపై ఐదు స్థాయిల్లో ఛార్జీషీట్లు వేయాలని నిర్ణయించాం.రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. సర్పంచుల స్థానంలో వార్డు వాలంటీర్లు పెత్తనం చేస్తున్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు నగదు ప్రోత్సాహం ఇవ్వలేని ప్రభుత్వం ఇప్పుడు పంచాయతీలకు అవార్డులు ఇస్తామంటే ఎవరు నమ్ముతారు. ధాన్యం కొనుగోళ్లు వైసీపీమాఫియా చెప్పిందే నడుస్తోంది. వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదు. అన్నమయ్య డ్యాం కొట్టుకు పోతే బాధితులకు ఇప్పటి వరకూ ఆదుకోలేదు. కాంట్రాక్టర్లు డబ్బులు రావని పనులు చేయటం లేదు.

ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు డబ్బులు చెల్లించకపోవడంతో వారు వైద్యం ఆపేసే పరిస్థితి. కేంద్రం ఇచ్చిన మెడికల్ కాలేజీల పనులు మాత్రమే జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న కాలేజీల పనులు కనీసం ప్రారంభం కాలేదు. ఏపీ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది, ఎవరూ అప్పు ఇచ్చేపరిస్థితి లేదు. వైసీపీ పోవాలి బిజెపి రావాలి. ఇదొక్కటే మార్గం. వైసీపీ, టిడిపి రెండు విమర్శలు, ప్రతి విమర్శలకు పరిమితం అవుతున్నాయి.

LEAVE A RESPONSE