Suryaa.co.in

Telangana

అమర వీరుల ఆశయాలను అమలు పరుస్తాం

– డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, జూన్ 22 : తెలంగాణా రాష్ట్ర సాధనకు అసువులు బాసిన అమర వీరుల త్యాగాలు వెలకట్టలేనివని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సచివాలయం సమీపంలో గురువారం అమర వీరుల స్మారక కేంద్రం ప్రారంభాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి ట్యాంకు బండు వరకు పెద్ద సంఖ్యలో బీ ఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ ని నిర్వహించారు. సితాఫలమండీ లో ఈ ర్యాలీ ని కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, బీ ఆర్ ఎస్ నేతలు రామేశ్వర్ గౌడ్, కిరణ్ కుమార్, కరాటే రాజు, జలంధర్ రెడ్డి, రాజ సుందర్ లతో పాటు నేతలు పాల్గొన్నారు. సికింద్రాబాద్ లోని అన్ని డివిజన్ల నుంచి కార్యకర్తలు ర్యాలీ లుగా తరలివెళ్ళారు.

LEAVE A RESPONSE