Suryaa.co.in

Andhra Pradesh

వరద బాధితులకు ఆపన్న హస్తంతో మేటి పశ్చిమగోదావరి జిల్లా

– ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకున్న కలెక్టర్ చదలవాడ నాగరాణి
– జిల్లా తరుపున రూ. 1,17,75,351 చెక్కును సిఎంకు అందించిన కలెక్టర్
– లక్షలాది రూపాయలు వెచ్చించి తొలివారం ఆహార పదార్థాల పంపిణీ
– కలెక్టర్ చదలవాడ నాగరాణి చొరవ, ప్రోత్సాహంతో విరాళాల వెల్లువ

అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో కొనసాగిన వరద సహాయక చర్యలకు అండదండలు అందించటంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు మేమున్నామంటూ తొలి వరుసలో నిలిచారు. ప్రభుత్వాధినేత పిలుపు మేరకు సేకరించిన విరాళాల మొత్తం రూ. 1,17,75,351లను శుక్రవారం అమరావతిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడికి అందించారు.

ముఖ్యమంత్రి మార్గనిర్దేశకత్వంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను గురించి కలెక్టర్ ఈ సందర్భంగా సిఎంకు వివరించారు. యువతకు ఉపాధి కల్పన దిశగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. వరదల వేళ జిల్లా నుండి వారం రోజుల పాటు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, విద్యాసంస్థలు, ప్రజల అండదండలతో లక్షలాది రూపాయల విలువ కలిగిన ఆహార పదార్థాలను ప్రత్యేక వాహనాల ద్వారా విజయవాడ తరలించామన్నారు.

పరిస్థితులు చక్కబడిన తర్వాత వరద బాధితులకు నిత్యవసరాలు, దుస్తులు, తదితర అవసరాలకు ఆర్థిక ప్రయోజనం అందచేయలన్న సిఎం పిలుపు మేరకు, అన్ని వర్గాల ప్రజలను ప్రోత్సహించి విరాళాలు సేకరించామని తెలిపారు.

ఈ క్రమంలో మంచి పనితీరును ప్రదర్శిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు కలెక్టర్ చదలవాడ నాగరాణిని అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని ఈ సందర్భంగా సిఎం సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, ప్రభుత్వ కార్యక్రమాలలో డ్రౌన్ సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేకంగా హస్తకళా నైపుణ్యంతో తీర్చిదిద్దిన చంద్రబాబు చిత్రాన్ని బహుకరించారు.

LEAVE A RESPONSE