– బాబు చేస్తున్నది మన కోసం
( కృష్ణారావు)
టిసిఎస్ కంపెనీ రతన్ టాటా గారిది. ఆ కంపెనీ నిబద్దత ప్రపంచానికి తెలిసిందే. టిసిఎస్ కి ఇచ్చిన భూమి విలువ 300 కోట్లు. ప్రభుత్వం 30/- కే ఇచ్చేసింది.
చంద్రబాబు ఏమి పిచ్చోడు కాదు.
టిసిఎస్ అక్కడ 13,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. తక్షణం 12,000 మందికి ఉద్యోగాలు ఇస్తుంది. అక్కడ టిసిఎస్ ఉత్పత్తుల వల్ల ప్రతి నెల ఏపీ కి 300 కోట్ల ఆదాయం. ఆ భూమిని టిసిఎస్ కి ఒక్కసారి అమ్మితే రావలసిన 300 కోట్లు ఏపీ కి ప్రతినెలా వస్తుంది.
ఇక్కడే ట్విస్ట్!
టిసిఎస్ అంత పెద్ద కంపెనీ ఏపీ కి వచ్చింది అంటే ప్రపంచ ఐటీ కంపెనీలు అన్నీ ఏపీ వైపు చూస్తున్నాయి. విశాఖ లాంటి సుందరమైన నగరం లో 1/- కే ఎకరం భూమి ఇస్తున్నారా అని షాక్ లో ప్రపంచ కంపెనీలు. ఫలితంగా ఏపీ వైపు క్యూ కడుతున్న ప్రపంచ స్థాయి కంపెనీలు.
ఆ వరుసలో మైక్రో సాఫ్ట్, క్వాల్కమ్, విప్రో, గూగుల్, ఉర్సా బిల్ గేట్స్ కి చెందిన సంస్థలు లాంటి కంపెనీలు విశాఖకి. వీటివల్ల ఏపీ కి రానున్న ఉద్యోగాలు దాదాపు 2 లక్షలు, రాబోయే ఆదాయం ఏడాదికి 90 వేల కోట్లకు పైమాటే! ఇంకా వరుసలో ఐటీ దిగ్గజ కంపెనీలు ఎన్నో. ఇది కదా సంపద సృష్టి అంటే! ఇపుడు మొక్కలు నాటుతున్నారు. మరో మూడేళ్లలోపే ఫలాలు చూస్తాం.
ఇప్పుడు మరో ముఖ్య విషయం..
జగన్ పాలనలో భోగాపురం విమానాశ్రయం దగ్గర 6,000 ఎకరాల స్కామ్, 9,000 కోట్ల విలువైన దసపల్లా భూముల దోపిడీ, వైస్సార్ జమానా లో మూడసరలోవా రిజర్వాయర్ దగ్గర 2,600 ఎకరాల భూమి జగన్ బినామీ పేరున దోపిడీ, దీని విలువ 50,000 కోట్ల పైమాటే.
రాంకీ కి ఫార్మా సెజ్ దగ్గర దోచి పెట్టిన భూమికి బదులుగా వచ్చిన సొమ్ముతోనే పెట్టిన పేపర్ సాక్షి.. జగన్ 16 నెలలు చిప్పకూడు తినడానికి కారణం అబ్బా కొడుకులు కలిసి భూములు దోచిపెట్టి పొందిన మేళ్లు 43,000 కోట్ల దోపిడీలోనే కాదా?
సరస్వతి పవర్ కంపెనీ లో భూదోపిడీ, ఇడుపుల పాయలో 3,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ, ఇలా ఉమ్మడి ఏపీ మొత్తం వైయస్ కుటుంబ భూ దోపిడీ వేల వేల ఎకరాలు.
ఇక విషయానికి వద్దాం..
లక్షల ఎకరాల వైయస్ కుటుంబ భూ దోపిడీ వల్ల రాష్ట్రానికి నయాపైసా ఉపయోగం లేదు. కానీ లీజు పద్దతిలో పరిశ్రమలకు ఇవ్వడం వల్ల లక్షల్లో ఉద్యోగ అవకాశాలు చూస్తున్నాం. ఉదాహరణ గా హైదరాబాద్ నే చూడండి.
ఏపీ సామాన్య ప్రజలారా .. జగన్ అండ్ కో దొంగ బ్యాచ్ మాటలు నమ్మకండి. ఏపీ అభివృద్ధిలో పాలు పంచుకోండి. బాబుకి సహకరించండి. ఆయన తీసుకునే నిర్ణయాల మీద రాళ్లు విసరకండి. ఆయన చేస్తున్నది మన కోసం.