– ఇది ఆనందించే సమయమా?
– అభిమానులపై పవన్ ఆగ్రహం
తిరుపతి : తన అభిమానులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ఆస్పత్రికి పవన్ వెళ్లారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న అభిమానులు పెద్దగా నినాదాలు చేశారు. దీంతో “మనుషులు చనిపోయారు. ఇది ఆనందించే సమయమా? ఏడ్చే సమయమా..? మీకు బాధలేదా?. కొంత కూడా బాధ్యతలేకపోతే ఎలా” అని మండిపడ్డారు.