Suryaa.co.in

Political News

తెలంగాణ బిజెపి కాపు నాయకత్వాన్ని ఎందుకు పక్కన పెట్టింది?

– ఓ కేంద్ర ప్రభుత్వమా.. కాపులకు అధికారం వద్దా?
– కాపులు రాజకీయంగా అణిచివేయబడుతున్నారు

ఢిల్లీ బీజేపీ కాపులను రాజకీయంగా అణిచి వేయాలని చూస్తుంది. ఢిల్లీ కాంగ్రెస్ రాజకీయంగా కాపులకు ఏం ఇచ్చింది. ద్రోహమే చేసింది. కేంద్ర,రాష్ట్ర రాజకీయాలు కాపుల ఆత్మగౌరవాన్ని సమయం వచ్చినప్పుడల్లా తొక్కేస్తున్నాయి.

రెడ్లు రాజకీయంగా సాధిస్తున్నారు. కమ్మ రాజకీయంగా సాధిస్తుంది. కాపులు రాజకీయంగా సాధించలేరా? కాపులు రాజకీయంగా అణిచివేయబడుతున్నారు.

కాపులు రాజకీయంగా ఏం మార్పు సాదించారో, కాపు సంఘం తెలియజేయాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పేరు వినపడింది.. బిజెపికీ ఊపిరిపోసింది.. ఒకే ఒక్కడు.. పోరాడే యోధుడు బండి సంజయ్.
తెలంగాణ బిజెపి కాపు నాయకత్వాన్ని ఎందుకు పక్కన పెట్టింది? ఒక్కసారి ఆలోచన చేయండి కాపు సోదరులారా..

కేంద్ర రాష్ట్ర పార్టీలకు పోరాడాలంటే కాపులు కావాలి. కేంద్ర రాష్ట్ర పార్టీల కోసం,వాళ్ళ పనికి మాలిన సిద్దాంతాల కోసం, కాపులు త్యాగాలు చేయాలి. రోడ్లు మీదకు రావాలి. కేసులో మన రాజకీయ నాయకులు బలికావాలి. కేంద్ర రాష్ట్ర పార్టీలు అధికారంలోకి రావాలంటే కాపు ఓట్లు కావాలి.

ఓ కేంద్ర ప్రభుత్వమా.. కాపులకు అధికారం వద్దా? మా ఓట్లు మీకు కావాలి. రాజ్యాధికారం మాత్రం దోపిడీ కులాల నాయకులకు. ఇది ఎక్కడి న్యాయం? కాలం మారింది. కాపులలో చైతన్యం వచ్చింది. కాపు యువత రాజకీయాల వైపు చూస్తుంది. ఇక కావలసింది కాపు రాజ్యాధికారం మాత్రమే.

– దార్ల మహేష్ నాయుడు
గుంటూరు తూర్పు నియోజకవర్గం
జనసేన పార్టీ.

LEAVE A RESPONSE