– తప్పు చేయకపోతే భయమెందుకు?
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
ప్రజాస్వామ్యబద్దంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ అరెస్ట్ లు, హౌస్ అరెస్ట్ లు చేసి ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కనగానపల్లి మండలం తూంపల్లెలో మంత్రి ఉష శ్రీచరణ్ రిసార్టు నిర్మిస్తున్న ప్రాంత పరిశీలనకు టిడిపి పిలుపునిస్తే నాయకులను గృహనిర్బంధాలకు పాల్పడటం అమానుషం. కళ్యాణ దుర్గాన్ని కబ్జాల నగరంగా మార్చారు.
సాక్షాధారాలతో సహా మంత్రి అవినీతిని భయపెట్టిన టీడీపీ నాయకులను అక్రమ అరెస్ట్ లు చేస్తారా? తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి? అక్రమ అరెస్ట్ లు చేయించారంటే తప్పు చేశారని ఒప్పుకున్నట్లే? ప్రజాధనాన్ని దోచుకునే హక్కు వైసీపీ నాయకులకు ఎవరిచ్చారు? రాత్రింభవళ్లు కష్టపడుతున్న రైతులకు నీళ్లు ఇవ్వడం చేయగాదు కాని స్విమ్మింగ్ ఫూల్స్ కు మాత్రం నీళ్లు ఇస్తారా? రైతుల త్యాగాలను సొమ్ము చేసుకుంటున్న మంత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.