వైసీపీ నాయకులు విష సర్పాల్లా తయారయ్యారు

* మంత్రులు ప్రజా సమస్యలు గాలికొదిలేసి పవన్ కళ్యాణ్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు
* నోటికొచ్చినట్లు పేలే మంత్రులను ప్రజలే తరిమికొడతారు
* వైసీపీని ఓఎల్ఎక్స్ లో పెట్టే రోజులు వస్తున్నాయి
* తిరుపతి మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, తిరుపతి నగర అధ్యక్షుడు రాజారెడ్డి

పాము తాను పెట్టిన గుడ్లు తానే తినట్లు… వైసీపీ నాయకులు తమ కార్యకర్తలనే మింగేస్తున్నారు.. ఇక ప్రజలను దోచేయకుండా ఉంటారా అని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి వ్యాఖ్యానించారు. తిరుపతి జనవాణి కార్యక్రమంలో తమ భూములు తమ నాయకులే కబ్జా చేశారని వైసీపీ కార్యకర్తలు కొందరు పవన్ కళ్యాణ్ ముందు మొరపెట్టుకున్నారని తెలిపారు. వైసీపీ పార్టీని ఓఎల్ఎక్స్ లో పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆకేపాటి సుభాషిణి మాట్లాడుతూ “వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజల పట్ల విష సర్పాల్లా తయారయ్యారు. ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి… పవన్ కళ్యాణ్ ని తిట్టడమే పనిగా పెట్టుకుంది. పవన్ కళ్యాణ్ ని విమర్శించే ముందు మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారో చెప్పాలి. పవన్ కళ్యాణ్ ని విమర్శించడంలో ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై పెట్టి ఉంటే రాష్ట్రం కొంతైనా అభివృద్ధి చెందేది. ఆస్తిలో వాటా ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందోనని సొంత చెల్లినే జగన్ రెడ్డి తరిమేశారు. వచ్చే ఎన్నికల్లో సింపతి కోసం అమ్మ ప్రయాణిస్తున్న కార్ టైర్ ను పగలగొట్టొచ్చు? లేదా ఏకంగా లారీతోనే గుద్దించొచ్చు. ఎందుకైనా మంచిది తల్లి, చెల్లి జాగ్రత్తగా ఉండటం మంచిదని అన్నారు.

ఇష్టానుసారం మాట్లాడితే తరిమికొడతాం : రాజారెడ్డి
తిరుపతి సిటీ జనసేన ప్రెసిడెంట్ రాజారెడ్డి మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ పై అవాకులుచవాకులు పేలితే వైసీపీ నాయకులను రోడ్లపై తరిమి కొడతాం. వైసీపీలో కామపిశాచాలు ఉన్నాయి. తెలుగువారి గౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో తీసేశారు. ఫోటో సూట్ ల మంత్రి అమర్నాథ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. లేదు ఇష్టానుసారం మాట్లాడుతాను అంటే తాటతీస్తాం. పవన్ కళ్యాణ్ ని విమర్శించే దాడిసెట్టి రాజా లాంటి వాళ్ళకి మేము ఒకటే చెబుతున్నాం.. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడితే మాత్రం రోడ్లపైనే తరిమికొడతామ”ని హెచ్చరించారు.

Leave a Reply