ప్రభుత్వ ఆస్పత్రుల ముందు రాక్షసులు అంబులెన్స్ డ్రైవర్ల రూపంలో దర్శనమిస్తున్నారు.నిన్న తిరుపతి రుయా ఆస్పత్రిలో అంబులెన్సుల అరాచకాన్ని మరువకముందే ఇప్పుడు విశాఖలోని కేజీహెచ్ ఘటన వెలుగులోకి వచ్చింది.వైజాగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో పెనుగొల్లుకు చెందిన ఓ బాలింత బిడ్డకు జన్మనిచ్చింది.ఆమె భర్త మనోజ్ భార్యను ఇంటికి తీసుకువెళ్లేందుకు ప్రైవేట్ వాహనాన్ని తీసుకొచ్చాడు.భార్యను తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్, వాచ్మెన్లు దాడి చేశారు.మనోజ్ను రక్తం కారేలా కొట్టారు.సొంత వాహనం ఉందని, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ అవసరం లేదని చెప్పినందుకు ఇలా దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.అవసరం ఉన్నా, లేకున్నా డబ్బులు కట్టాల్సిందేనని దాడులు చేస్తున్నారు.అంతేకాకుండా ఆస్పత్రి అంతా లంచాలమయంగా మారిందని బాధితులు తెలిపారు.ఈ ఘటనపై బాధితులు ఆస్పత్రి సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేసి బాధితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Devotional
ఈ ఆలయంలో శ్రమే విరాళం.. డబ్బులకు చోటు లేదు
మన దేశంలో చిన్న పెద్ద అనేక ఆలయాలున్నాయి. ఎక్కువగా ఆలయాల్లో భక్తులు తమ శక్తి కొలదీ నగదు, బంగారం, వెండి వాటితో పాటు రకరకాల వస్తువులను విరాళాలుగా అందిస్తారు. అయితే ఒక ఆలయంలో మాత్రం డబ్బులు తీసుకోరు. కేవలం అక్కడ పనిని మాత్రమే చేయాల్సి ఉంటుంది. దాదాపు 12 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న ఆలయంలో…
ఉగాది ఆచారాలు – సత్ఫలితాలు
సంవత్సరాది రోజు – కుటుంబసభ్యులు అందరూ – సూర్యోదయపు పూర్వము నువ్వుల నూనె ఒంటికి రాసుకొని, శీకాయపొడి లేదా కుంకుళ్ళుతో అభ్యంగన స్నానమాచరించాలి. ఈ అభ్యంగన స్నాన విధి వలన జ్యేష్టాదేవి నిష్క్రమించి, లక్ష్మీ శక్తులకి ఆహ్వానం కలుగుతుంది. సంవత్సరాది రోజు ప్రాతఃకాల ప్రథమ పూజ అనంతరం, ‘ఉగాది పచ్చడి’ నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. ఉగాది…
Sports
ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు
* రూ.5 కోట్ల వ్యయంతో ముస్తాబు * వేగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులు * హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నేతృత్వంలో మైదానం మొత్తం పరిశీలించిన బీసీసీఐ, ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ప్రకటించారు. బుధవారం…
భారత ఖోఖో జట్లకు శాప్ ఛైర్మన్ అభినందన
ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా…