బీఆర్‌ఎస్‌లో చేరికలకు పెరుగుతున్న ఆసక్తి

– కేసీఆర్‌తో వివిధ రాష్ట్రాల నేతల భేటీ

బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు జనాదరణ పెరుగుతున్నది. పార్టీ సిద్ధాంతాలు అధినేత సీఎం కేసీఆర్ పాలనపట్ల దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. పలు రాష్ట్రాల నుంచి సీనియర్ రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు ఆకర్షితులై పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. ఈ మేరకు శనివారం నాడు ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ గారితో మహారాష్ట్రకు చెందిన పలువురు మాజీ ఎంపీలు, జిల్లా చైర్మన్లు, సీనియర్ నాయకులు భేటీ అయ్యారు.

సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్తు, ఆసరా పింఛన్లు తదితర పథకాలు, దాంతో పాటు తెలంగాణలో అప్రతిహతంగా కొనసాగుతున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి మరియు ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమవివరాలను సీఎం గారిని అడిగి తెలుసుకున్నారు.

బీఆర్ఎస్ జాతీయ పార్టీగా పరిణామం చెందడాన్ని ఆహ్వానించిన మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎంపీలు, సీనియర్ నేతలు, దేశ రాజకీయాల్లో కేసీఆర్ వంటి ప్రత్యామ్నాయ ప్రగతి కాముక రాజకీయ నాయకత్వం నేడు ఎంతగానో అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ విధివిధానాల గురించి వారు సుదీర్ఘంగా చర్చించారు. తాము పార్టీలో చేరడానికి తమ సంసిద్ధతను వ్యక్తపరిచారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తో భేటీ అయిన వారిలో.. ఛత్తీస్ ఘడ్ కు చెందిన నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భారతి, మధ్య ప్రదేశ్ బాలాఘాట్ మాజీ ఎంపీ బోధ్ సింగ్ భగత్, మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కుషాల్ భోప్చే, చత్తీస్ ఘర్ సారంగద్ మాజీ మంత్రి డాక్టర్ చబ్బీలాల్ రాత్రే, గడ్చిరోలి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పసుల సమ్మయ్యపోచమ, రిపబ్లికన్ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శంకర్, సిద్ధిపేట జిల్లా బీఆర్ఎస్ నాయకుడు అంబటి బాలచంద్ర గౌడ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply