Suryaa.co.in

Andhra Pradesh

అమరావతి ఉద్యమంలో బిజేపి కూడా భాగస్వామే

– రాష్ట్ర అభివృద్దికి 3 లక్షల కోట్ల నిధులిచ్చింది
– కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ

అమరావతి: గత ప్రభుత్వ దుర్మార్గం వల్ల రాజధాని రైతుల్లో అభద్రత భావం ఏర్పడింది. అందుకే వారు అమరావతి ఏకైక రాజధాని అని పార్లమెంట్ లో చట్టం చేయాలని కోరుతున్నారు. గతంలో ఏ విభజిత రాష్ట్రానికి కూడా ఇలా రాజధాని విషయంలో చట్టం పార్లమెంట్ లో చేయలేదు.

రాజధాని అమరావతి ఉద్యమంలో బిజేపి కూడా భాగస్వామే. అవసరమైతే రైతుల కోరిక మేరకు పార్లమెంట్ లో చట్టం తెచ్చే యోచన చేస్తాం. రైతులకు అండగా నిలుస్తాం. ప్రధాని అమరావతి పర్యటన ఏర్పాట్లను దాదాపు పూర్తి అయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర అభివృద్దికి వివిధ ప్రాజెక్టుల రూపంలో అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్లకు కేంద్ర నిధులిచ్చింది.

ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాజెక్టులు కలుపుకుంటే ఈ మొత్తం దాదాపు 3 లక్షల కోట్లకు సమానం. 2029 నాటికి అమరావతికి ఒక రూపు ఎన్డీఏ కూటమి తీసుకొస్తుంది. అందులో అనుమానం అవసరం లేదు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయడానికి టీడీపీ, జనసేన, బిజేపీలు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయి. సభా వేదిక ను పరిశీలించిన వారి లో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు,ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఉన్నారు.

LEAVE A RESPONSE