– మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
– కుల గణన నిర్ణయం పట్ల హర్షం
ఢిల్లీ: కులం , కులం ఆధారిత వివక్ష ఒక కఠినమైన వాస్తవం. చాలా కాలం పాటు మనం ఈ వాస్తవాన్ని అంగీకరించకుండా విస్మరించడానికే ప్రాధాన్యం ఇచ్చాం. ఇప్పుడు మనం చైతన్యంతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది. కులాన్ని ఒక గుర్తింపుగా తీసుకుని జనగణన లో కుల గణన నిర్వహించడం సరైన దిశలో వేసిన సాహసోపేతమైన అడుగు.
ప్రామాణికమైన డేటాను సేకరించకపోతే సమగ్ర దృష్టితో అభివృద్ధి కార్యాచరణను రూపొందించడం సాధ్యపడదు. కుల గణన తో మన సమాజంలోని అన్ని వర్గాలకు అధికారంలో, ఆర్థిక అభివృద్ధిలోను తగిన వాటా లభించేలా చేయడంలో తోడ్పడుతుంది. సామాజిక-ఆర్థిక అసమానతలను తగ్గించడంలో కూడా ఎంతో దోహదపడుతుంది అని నేను నిస్సంశయంగా ఆశిస్తున్నాను, నమ్ముతున్నాను.
జనగణనలో ప్రతి సామాజిక సూచికను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ఇది సామూహిక ప్రయోజనాన్ని లక్ష్యంగా చేసుకున్న సమగ్ర వినియోగ ప్రక్రియగా మారాలని ఆశిస్తున్నాను: కుల గణన నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వానికీ హృదయపూర్వక అభినందనలు.