Suryaa.co.in

Andhra Pradesh

తెదేపా కేంద్ర కార్యాలయంలో 67వ అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమం

మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం నాడు డా. అంబేడ్కర్ 67 వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగా కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా నాయకులు డా. అంబేడ్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. రాష్ట్రంలో జగన్‌రెడ్డి పాలనలో దళితులపై దమనకాండ కొనసాగుతోందని విమర్శించారు. కేంద్ర నేరగణాంక సంస్థ విడుదల చేసిన 2022 నివేదికలో దళిత-గిరిజనులపై జరుగుతున్న దాడుల్లో రాష్ట్రం దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలవడం సిగ్గుచేటని విమర్శించారు.

నా ఎస్సీలు, నా ఎస్టీలు అని పలికే నైతిక అర్హత జగన్ మోహన్ రెడ్డికి లేదన్నారు. జగన్ రెడ్డి కపట ప్రేమను దళితులు తెలుసుకున్నారని.. రాబోయే ఎన్నికల్లో వైకాపాను ఓడించేందుకు దళితులు సిద్దంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఏం ఏ షరీఫ్ గారు, శాసనమండలి సభ్యులు అశోక్ బాబు గారు, పార్టీ నాయకులు పిల్లి మాణిక్యరావు, దేవతోటి నాగరాజు, కోడూరి అఖిల్, బుచ్చి రాంప్రసాద్, ఏవి రమణ, హసన్ భాష, పర్చూరు కృష్ణ, దేవినేని శంకర్ నాయుడు, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE