Suryaa.co.in

Telangana

కేసీఆర్ సారు మంచిగిస్తుండు బిడ్డా…

-ఎమ్మెల్సీ కవిత తో కంకులమ్మే నర్సమ్మ
-ఎమ్మెల్సీ కవిత తో ఫోటోలు దిగేందుకు స్దానికుల ఆసక్తి

జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత తిరుగు ప్రయాణంలో మల్యాల మండలం నూకపల్లి శివారు వద్ద కాస్త సేదదీరారు.రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న ఓ మహిళా దగ్గరికెళ్లి కంకులు కొనుగోలు చేసి అక్కడే రుచి చూశారు.

ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత రుచిని ఆస్వాదిస్తూ ఆమె వివరాలు సేకరించారు..తన పేరు నర్సమ్మ అని పేర్కొంటూ నాటికి నేటి కేసీఆర్ సారు పాలనకు తేడాను వివరించింది కొమురమ్మ…తనకే కాదు ఇంటింటికి పించన్ తదితర రూపాల్లో కేసీఆర్ మంచిగిస్తుండని కొమురమ్మ పేర్కొంది..స్వయంగా కేసీఆర్ బాపు కూతురే తన వద్ద మొక్కజొన్న తింటూ మాట్లాడటంపై కొమురమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

ఇక ఎమ్మెల్సీ కవితను చూసిన స్దానిక వాహనదారులు సెల్ఫీలు,ఫోటోలు దిగుతూ అభిమానాన్ని చాటుకోగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు ఎమ్మెల్సీ కవిత.ముఖ్యమంత్రి కూతురిగా ఉన్నా.. సాదాసీదాగా వ్యవహరించిందని ఈ సందర్భంగా పలువురు వాహనదారులు చర్చించుకుకోవటం విశేషం.

LEAVE A RESPONSE