Suryaa.co.in

Telangana

మహిళలకు తగినన్ని సీట్లివ్వలేదు కదా? మరి ప్రగతిభవన్‌ దగ్గర ధర్నా చేస్తావా?

– ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ సవాల్‌

బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ చూసాక తెలంగాణ రాష్ట్ర బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కవిత , తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలి.కేవలం లిక్కర్ స్కాం నుంచి దేశ ప్రజలను పక్క దారి పట్టించేందుకే కవిత మహిళా రిజర్వేషన్ డ్రామా అనేది ఈ లిస్ట్ తో రుజువైంది.

119 స్థానాల్లో 7 గురు మహిళలకు టికెట్ లు ఇచ్చిన మీకు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మాట్లాడే అర్హత లేదు.జనాభా లో 50% ఉన్న మహిళలకు బీఆర్‌ఎస్‌ పార్టీ 3% టికెట్ లు ఇస్తూ , దేశ వ్యాప్తoగా పార్టీ కమిటీ లల్లో మహిళలకు 30% రిజర్వేషన్ ఇస్తున్న బీజేపీ మీద వీళ్ళు పోరాటం చేస్తాననడం సిగ్గుచేటు.

మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీ రోడ్ ల మీద ధర్నాలు చేసిన కవిత ప్రగతి భవన్ ముంగట ఎందుకు ధర్నా లు చేయలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు ను మొదట పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది ఎన్డీఏ ప్రభుత్వమే. వరుసగా 4 సార్లు ప్రవేశ్ పెట్టింది బీజేపీ నే. త్వరలో బిల్లు తీసువచ్చేది బీజేపీ ప్రభుత్వమే.

పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు పత్రాలు చింపి పారేసిన పార్టీ లతో అంట కాగుతు , సొంత పార్టీ లో ఏ ఒక్క కమిటీ లో మహిళల కు స్థానం ఇవ్వని బీఆర్‌ఎస్‌ పార్టీ కథ ఎమ్మెల్సీ కవిత దొంగ దీక్ష తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు.

ఉరికి ఉరికి కవిత ధర్నా ల కూర్చున్న నాయకులంతా, పట్టుమని పది మంది మహిళలకు మీ సొంత పార్టీ టికెట్ లు ఇయ్యకుంటే ఎందుకు మాట్లాడతలేరు?

LEAVE A RESPONSE