Suryaa.co.in

Andhra Pradesh

భువనేశ్వరిని విమర్శించే ముందు రోజా తన బతుకేంటో తెలుసుకోవాలి

– బాబాయ్ ని చంపినప్పడు నిజం గెలవాలని, దోషులకు శిక్షపడాలని జగన్ ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేదో రోజా చెప్పాలి
• జగన్ రెడ్డి మెప్పుకోసం రోజా తాను మహిళననే విషయం మర్చిపోయి మాట్లాడుతోంది
• చెక్ బౌన్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఈ రాష్ట్రానికి వచ్చి దాక్కున్న రోజాకు భారీ విల్లాలు, లగ్జరీ కార్లు.. వేలకోట్ల ఆస్తులు ఎక్కడినుంచి వచ్చాయి?
• మంత్రిగా ఉన్న రోజా, తన అన్న జగన్ తో మాట్లాడి తన ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించుకోకుండా ఉత్తుత్తి మాటలు చెప్పి తప్పించుకుంటోంది
– తెలుగు మహిళా నాయకురాలు సందిరెడ్డి గాయత్రి

‘నిజం గెలవాలి’ అనే నినాదం వైసీపీలో, తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది అనడానికి మంత్రి రోజా దిగజారుడు వ్యాఖ్యలే నిదర్శనమని, నిజం గెలవాలని అని చంద్రబాబునాయుడికి మద్ధతుగా ప్రజల్లోకి వెళ్లిన భువనేశ్వరిని విమర్శించే ముందు, జగన్ రెడ్డి తన బాబాయ్ ను చంపినవారికి శిక్షపడాలని… ఆయన హత్యోదంతంలో నిజం గెలవాలని ఎందుకు ప్రజల్లోకి వెళ్లలేకపోయాడో చెప్పగల ధైర్యం రోజాకు ఉందా అని తెలుగుమహిళ నాయకురాలు సందిరెడ్డి గాయత్రి నిలదీశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే …

“ వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ ఏళ్లతరబడి సాగుతున్నా.. అసలైన దోషులు న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థల కళ్లుగప్పి బయటతిరుగుతున్నా జగన్ గానీ, మంత్రులుగానీ ఎందుకు ఆ విషయంపై ఎందుకు పోరాడలేదు? సొంత బాబాయ్ కోసం జగన్ ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం…. ఆయనే అసలు దోషి కాబట్టి. తన భర్తకు జరిగిన అన్యాయంకంటే, రాష్ట్రానికి.. ప్రజలకు జరిగే అన్యాయంపై తీవ్ర కలత చెంది, బాధాతప్తహృదయంతో భువనేశ్వరి ప్రజల్లోకి వస్తే, సిగ్గులేకుండా అలాంటి ఆమెపై విమర్శలు చేస్తారా?

భువనమ్మ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు వెలకట్టలేనివి. ఎన్నో వేల కుటుంబాలు.. ఎందరి జీవితాల్లోనో తన సేవా కార్యక్రమాల ద్వారా ఆమె వెలుగులు నింపారు. అలాంటి మానవతామూర్తిని విమర్శిం చే ముందు రోజా తన బతుకేంటో ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది.

చెక్ బౌన్స్ కేసుకు భయపడి పారిపోయిన రోజాకు నేడు వేలకోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? విల్లాలు, లగ్జరీకార్లు జబర్దస్త్ లో జడ్జిగా చేసినందుకు ఫీజుగా వచ్చాయా?
గతంలో చెక్ బౌన్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి వేరే రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి వచ్చిన రోజా, నేడు వేలకోట్లు ఎలా సంపాదించగలిగింది? రాజభవనాలను తలపించే ప్యాలెస్ లు.. విల్లాలు.. 20వరకు లగ్జరీ కార్లు… నిండా 20ఏళ్లు నిండని తనకొడుకు పేరిట కోట్ల విలువైన బెంజ్ కారు ఎక్కడినుంచి వచ్చాయో సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం రోజాకు ఉందా? రోజాకు ఇప్పుడున్న ఆస్తులన్నీ జబర్దస్త్ లో న్యాయనిర్ణేతగా వ్యవహరించినందుకు రాసిచ్చారా? తన నియోజకవర్గమైన నగరిలో రోజా అనే పేరెత్తి తే జనం ఆమె గురించి పుంఖానుపుంఖాలుగా చెబుతున్నారు.

ఏ పని చేయాలన్నా రోజా చెయ్యి తడపాల్సిందేనని బహిరంగంగానే అక్కడి ప్రజలు చెబుతున్నారు. నగరి లో కొండలు, గుట్టలు, చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన చరిత్ర రోజాది. బజార్లలో రూపాయి.. రెండురూపాయిలకు చెయ్యిచాపే రోజా లాంటి మనిషి… భువన మ్మ గురించి మాట్లాడటం సిగ్గుచేటు. రోజా బతుకు మొత్తం కలిపినా భువనమ్మ చెప్పుల విలువ కూడా చేయదు. నోరుందని ఎవర్ని పడితే వాళ్లను ఇష్టమొచ్చినట్టు రోజా అంటుంటే చూస్తూ ఊరుకోం.

తన అన్న అని చెప్పుకునే పనికిమాలిన జగన్ రెడ్డి గానీ, మంత్రిగా తాను గానీ ప్రజలకు, రాష్ట్రానికి ఇదిగో ఇది చేశామని ఆపకుండా నాలు గు నిమిషాలు మాట్లాడే ధైర్యం నీకుందా రోజా? నువ్వు ఇలానే ప్రవర్తిస్తే నీ కుటుంబ సభ్యులే నిన్ను ఛీ కొడతారని గుర్తుంచుకో రోజా. జగన్ రెడ్డి మెప్పుకోసం మహిళననే విషయం కూడా మర్చిపోయి నోటికి పనిచెబితే.. నీకు ప్రజలు ఊహించని విధంగా బుద్ధి చెబుతారు. మంత్రిగా ఉన్న నువ్వు సీబీఐ విచారణ కోరకుండా.. ఇతరుల్ని అంటావా? నీ అన్న జగన్ రెడ్డితో చెప్పి నీపై సీబీఐ విచారణ నువ్వే కోరేట్టు చేయ వచ్చుగా రోజా!

ప్రజలసొమ్ము కొట్టేసి భారీ ప్యాలెస్ లు కట్టుకొని వాటిలో రాజభోగాలు అనుభవిస్తున్న జగన్ రెడ్డి పేదవాడా? తనకు.. జగన్ రెడ్డికి ఈ నాలుగున్నరేళ్లలో వచ్చిన అవినీతి సొమ్ము వివరాలు బయటపెట్టే ధైర్యం రోజాకు ఉందా?
ప్రజలసొమ్ము కొట్టేసి భారీ ప్యాలెస్ లు నిర్మించుకొని వాటిలో రాజభోగాలు అనుభవి స్తున్న జగన్ రెడ్డి పేదవాడా.. ఆ మాట అనడానికి నీకు నోరెలా వస్తుంది రోజా ? రోజాసహా మంత్రులు.. వైసీపీనేతల చిట్టాలు విప్పితే, వారికి వేయడానికి ఇప్పుడు న్న శిక్షలు.. నిర్బంధించడానికి రాష్ట్రంలోని జైళ్లు సరిపోవు. జగన్ రెడ్డికి చంద్రబాబుని. .. ఆయన కుటుంబాన్ని తిట్టాలనిపించినప్పుడల్లా రోజా, కొడాలినాని లాంటి కుక్కల్ని బయటకు వదలుతాడు. తల్లిని, చెల్లిని తన స్వార్థానికి వాడుకొని.. రోడ్లపై తిప్పి అవసరం తీరాక వారిని గాలికివదిలేసిన జగన్ రెడ్డిని మించిన నీతిమాలినవాడు ఎవరూ ఉండరు రోజా.

తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ప్రతి పైసాకు సంబంధించిన సమాచారం మొత్తం బయటపెట్టడానికి తాము సిద్ధం. అలానే నీకు.. నీ అన్న జగన్ రెడ్డికి వచ్చే సొమ్ము లెక్కలు.. వివరాలన్నీ బయటపెట్టే ధైర్యం నీకుందా రోజా? రోజా పై టీడీపీ తరుపున కుక్కను నిల్చోబెట్టినా గెలుస్తుంది. ఎందుకంటే ఆస్థాయిలో ఆమెపై నగరి నియోజకవర్గప్రజలు ఉమ్మేస్తున్నారు. జగన్ రెడ్డిగానీ.. రోజాపై గానీ.. నోరు పారేసుకుంటున్న ఇతరమంత్రులు… వైసీపీనేతలపై టీడీపీ ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటే, మాటమాత్రంగా కూడా శ్రీమతి భారతిరెడ్డి స్పందించదు.

ఎంపీ గోరంట్ల వ్యాఖ్యలు జగన్ రెడ్డి చావు రాజకీయాలకు నిదర్శనం
ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు జగన్ రెడ్డి చావు రాజకీయాలకు నిదర్శనం. తన రాజకీయ జీవితం ప్రారంభించడానికి తండ్రిని చావుని వాడుకున్న జగన్ రెడ్డి.. గత ఎన్నికల్లో గెలుపొందడానికి బాబాయ్ వివేకానందరెడ్డి మరణాన్ని చంద్రబాబుపైకి నెట్టా డు. వచ్చేఎన్నికల్లో గెలవడం కోసం ఇప్పటినుంచే చంద్రబాబుని చంపుతాం.. ఆయన కుటుంబసభ్యుల్ని చంపుతామంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు.

గతంలో కూడా స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఎన్.ఎస్.జీ భద్రత లేకపోతే చంద్రబాబు ఫినిష్ అని మాట్లాడాడు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పలుసందర్భాల్లో పేట్రేగిపోయి మాట్లాడారు. జగన్ రెడ్డి సహా ప్రభుత్వ పెద్దల మాటలు గమనిస్తే, వారు ఎంత రాక్షసత్వంగా, కర్కశత్వంతో ఆలోచిస్తున్నారో అర్థమవుతోంది.” అని గాయత్రి స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE