Suryaa.co.in

Telangana

బీఆర్ఎస్ బీసీ ప్రముఖులతో ఎంపీ వద్దిరాజు భేటీ

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో శనివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి చెందిన బీసీ ప్రముఖుల సమావేశం జరిగింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర బీసీ ప్రముఖులతో సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్,ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి,మాజీ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్,మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, నోముల భగత్,బొల్లం మల్లయ్య యాదవ్,బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రావణ్ కుమార్, జూలూరు గౌరీశంకర్, డాక్టర్ చిరుమళ్ల రాకేష్, ఆంజనేయులు గౌడ్,గెల్లు శ్రీనివాస్ యాదవ్,ఉపేంద్రాచారి, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, ఆలకుంట హరి, గోసుల శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.

అంతకుముందు ఎంపీ వద్దిరాజు శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు సిరికొండ,మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావుతో సమావేశమై సమకాలీన రాజకీయాలపై చర్చించారు.

LEAVE A RESPONSE