Suryaa.co.in

Andhra Pradesh

జగన్ హిందువా?క్రిస్టియనా?

– జగన్ హిందువయితే తలనీలాలు సమర్పించాలి
– 1925లో వైఎస్ కుటుంబం క్రైస్తవ మతం తీసుకుంది
– విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల అందరూ క్రైస్తవులే
– జగన్ క్రిస్టియన్ కాకపోతే అక్కడున్న వైఎస్ శిలువను తొలగించాలి
– ఒరేయ్ సుబ్బిగా నువ్వు గురుస్వామివా?
– పొన్నవోలు కనపర్తిపాడులో పందులు మేపే వాడు
– టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి

నెల్లూరు: జగన్ ఒక హాఫ్ టికెట్. ఆయన హిందువా? లేక క్రిస్టియనా? అని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. 1925లో వైఎస్ కుటుంబం క్రైస్తవ మతం తీసుకుందని చెప్పారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ కుటుంబం, ఏసుక్రీస్తునే నమ్ముతోందని తెలిపారు. జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల అందరూ క్రైస్తవులే. తిరుమల డిక్లరేషన్ పై జగన్ సంతకం చేయాల్సిందేనని అన్నారు.

జగన్ పెళ్లి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారమే జరిగిందని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, భారతి తండ్రి అంత్యక్రియలు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారమే జరిగాయని, వైఎస్ సమాధి వద్ద శిలువ ఉంటుందని చెప్పారు . జగన్ క్రిస్టియన్ కాకపోతే అక్కడున్న శిలువను తొలగించాలని చెప్పారు. క్రైస్తవులను కూడా జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐకి ఇచ్చిన అఫిడవిట్ లో జగన్ తనను క్రిస్టియన్ గానే చెప్పుకున్నాడు.

జగన్ ఏదో ఒక మతంలో మాత్రమే ఉండాలని అన్నారు. జగన్ హిందువయితే తల్లి, భార్య, కూతుళ్లతో కలిసి తిరుమలకు రావాలని, స్వామివారికి జగన్ తలనీలాలు సమర్పించాలని చెప్పారు. జగన్ కుటుంబమంతా దొంగలేనని అన్నారు. సోనియాగాంధీ, అబ్దుల్ కలాం వంటి గొప్ప వాళ్లు తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ పై సంతకాలు చేశారని, నువ్వు వాళ్ల కంటే గొప్పవాడివా? అని ప్రశ్నించారు.

ఒరేయ్ సుబ్బిగా నువ్వు గురుస్వామివా? అని ప్రశ్నించారు. టీటీడీ ఛైర్మన్ గా ఉన్నప్పుడు వైవీ సుబ్బారెడ్డి పింక్ డైమండ్ కేసును విత్ డ్రా చేసుకోవాలనుకున్నాడని, అయితే కోర్టు అంగీకరించలేదని చెప్పారు. పొన్నవోలు కనపర్తిపాడులో పందులు మేపేవాడని, అందుకే పంది కొవ్వు ధరలు చెబుతున్నాడని వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు.

LEAVE A RESPONSE