Suryaa.co.in

Andhra Pradesh

వరద సాయం కింద రాష్ట్రానికి 1400 కోట్లు ఇచ్చాం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

ఏలూరు: వరద సాయం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 1400 కోట్లు ఇచ్చిందని, గాంధీ జయంతి రోజున మహిళా సాధికారత పురస్కరించుకొని మహిళలకు చెక్కులు పంపిణీలో పాల్గొనటం నా అదృష్టమని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఏలూరులో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా గాంధీ జయంతి రోజున రూ.1.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం సంతోషంగా ఉందని, డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడిపోయింది.. ప్రజల హితానికి పెద్దపీట వేస్తున్నాం… సమర్థవంతమైన నాయకత్వాన్ని సాగిస్తూ సుపరిపాలన అందిస్తున్నామని ఆమె చెప్పారు.

LEAVE A RESPONSE