Suryaa.co.in

Andhra Pradesh

తెలుగుదేశంలో చేరిన పద్మరాజు

రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం గుడిమూల పిఎసిఎస్ అధ్యక్షులు, ప్రముఖ వైద్యులు రుద్రరాజు పద్మరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి ఆదివారం నాడు కొత్తపేటలోని తమ నివాసంలో పార్టీ కండువా కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు.

సఖినేటిపల్లి మండల టిడిపి అధ్యక్షులు ముప్పర్తి నాని, ప్రధాన కార్యదర్శి తాడి సత్యనారాయణ, నియోజకవర్గ టిడిపి నాయకులు, ఆచంట నియోజకవర్గ పరిశీలకులు రుద్రరాజు వెంకట రామరాజు, టిడిపి బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్, టిడిపి వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, పెద్దాపురం నియోజకవర్గ పరిశీలకులు బోళ్ళ వెంకటరమణ, గుడిమూల గ్రామ టిడిపి అధ్యక్షులు మేడిద రత్నరాజు, కార్యదర్శి గూడపల్లి రమణ, టిడిపి మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు, టిడిపి నాయకులు రుద్రరాజు రామలింగరాజు (రాజా) తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE