Suryaa.co.in

Telangana

జమ్మూ ప్రాంతంలో బీజేపీ విజయం చారిత్రాత్మకం

– కాంగ్రెస్ ముక్త జమ్మూను ప్రజలు మరొకసారి నిరూపించారు
– జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: జమ్మూ ప్రాంతంలో బీజేపీ విజయం చారిత్రాత్మకం. గతంలో కంటే ఎక్కువ సీట్లు మరియు ఓట్లు పొందాం. జమ్మూ ప్రజలు మాతో ఉన్నారని మరోసారి నిరూపితమైంది. కాంగ్రెస్ ముక్త జమ్మూకశ్మీర్ సాధనలో మేం విజయం సాధించాం. కేంద్ర పార్టీ నాయకత్వ మార్గదర్శనంలో.. జమ్మూకశ్మీర్ రాష్ట్ర నాయకులు ఐకమత్యంతో అన్ని స్థాయిల్లో కష్టపడి పనిచేశారు.

జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గతంలో ఎప్పుడు కూడా సంపాదించనన్ని ఎక్కువ సీట్లలో, బీజేపీ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇకపై జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి మరింత కష్టపడి పనిచేస్తాం.

ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ప్రధానమంత్రి మోదీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించామని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ప్రజలే సరైన సమాధానం ఇచ్చారు. మోదీ పై ప్రజలకున్న విశ్వాసమేంటో.. జమ్మూకశ్మీర్, హరియాణా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి.

ప్రజలు చూపించిన విశ్వాసంతోనే.. జమ్మూ ప్రాంతంలోని 43 అసెంబ్లీ స్థానాల్లో.. బీజేపీ 29 స్థానాలు గెలుచుకుంది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ ముక్త జమ్మూను ప్రజలు ఈ ఎన్నికల ద్వారా మరొకసారి నిరూపించారు.

LEAVE A RESPONSE