Suryaa.co.in

Telangana

డిజిటల్ క్రాప్ సర్వే పేరుతో ఏఈఓలపై వేధింపులు తగవు

– డిజిటల్ సర్వేకు ఒప్పుకోలేదని 150 మంది ఏఈఓలను వివిధ కారణాలతో సస్పెండ్ చేయడాన్ని ఖండించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్‌: డిజిటల్ క్రాప్ సర్వేకు ఒప్పుకోలేదని 150 మంది ఏఈఓలను సస్పెండ్ చేయడం దారుణం.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో పక్క రాష్ట్రాల్లో ఏజెన్సీలు, ఇతర శాఖల సహాయంతో కేంద్ర ఇచ్చే నిధుల ద్వారా జరుగుతుంటే ఇక్కడ ఎందుకు ఏఈఓల నెత్తిన రుద్దుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు మేలు చేసేందుకు ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈఓను నియమించాలని .. 1500 కొత్త ఏఈఓల పోస్టులను సృష్టించి 2601 రైతు వేదికలను ఏర్పాటు చేయడం జరిగింది.

తెలంగాణలో వ్యవసాయ విస్తరణ, సాగు పెంపు, అధిక దిగుబడి సాధించి దేశానికి అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో వారి పాత్ర ఎనలేనిది.

అప్పటికీ వారికి పనిభారం పెరుగుతుందని మళ్లీ సర్వే చేయించి సుమారు 350 కొత్త క్లస్టర్ల ఏర్పాటుకు నిర్ణయించడం జరిగింది .. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాటిని మంజూరు చేసి కొత్త వారిని నియమించాలి. ఏఈఓల విజ్ఞప్తి మేరకు డిజిటల్ క్రాప్ సర్వేకు అవసరమైన సహాయకులను నియమించడం, ఏజెన్సీలకు పనిని అప్పగించడం చేయాలి.

LEAVE A RESPONSE