– విచారణ కొనసాగుతుంది
– నిరుద్యోగ వేద పండితులకు రూ. 3 వేల భృతి
– టీటీడీ సమీక్షా సమావేశంలో నిర్ణయాలను వెల్లడించిన మంత్రి ఆనం
తిరుమల: గతంలో సీఎం చంద్రబాబు దగ్గర జరిగిన సమావేశంలో ఆలయాలకు సంబంధించిన కొన్ని సమస్యలు ముందుకు వచ్చాయి.. వాటిని చర్చించుకొని రండి అని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తిరుమలలో టీటీడీ, దేవాదాయశాఖ సంయుక్త సమావేశం శనివారం జరిగింది. అనంతరం మంత్రి ఆనం విలేఖర్లతో మాట్లాడారు. చైర్మన్, ఈవో, అదనపు ఈవో, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి సమీక్ష చేశాం.. దేవాదాయ చట్టం ప్రకారం 9 శాతం కామన్ గుడ్ ఫండ్ టీటీడీ నుంచి తీసుకోవాల్సిన నిబంధనలు ఉన్నాయి.. గతంలో 5 శాతం ఉన్న దానిని 9 శాతంకు పెంచామని తెలిపారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే.. రాష్ట్రంలో ఉన్న అర్చక నిరుద్యోగులుగా ఉన్న అర్చక స్వాములకు భృతి ఇవ్వాలనీ మేనిఫెస్టో ఉంది. ఆ మేరకు రాష్ట్రంలో 590 వేద పండితులు రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్నారు. వారికి 3 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం.
శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని పునర్ నిర్మాణంలో ఉన్న ఆలయాలకు 147 కోట్లు విడుదల కాగా నిలిచిపోయాయి. శ్రీవాణి ట్రస్టు ద్వారా మరో 11 కోట్లు నిధులు మిగతా ఆలయాలకు రావాల్సి ఉంది. వీటింటిని చర్చించి నిర్ణయం తీసుకుంటామని బోర్డు, అధికారులు చెప్పారు. విజయవాడ దుర్గ గుడికి వెళ్లేందుకు మరో రోడ్డు మార్గం వేసేందుకు టీటీడీ సహకారం కావాలి. టీటీడీలో అన్యమతస్థులు ఉండేది వాస్తవం. కేంద్రమంత్రి బండి సంజయ్ టీటీడీలో పనిచేస్తున్న వేయి మంది అన్యమతస్థులు ఉన్నారన్న దానిపై విచారణ కొనసాగుతుంది. టీటీడీ కాలేజీ, పాఠశాలల్లో ఉన్న 192 పోస్టులను ఒప్పంద లెక్చరర్ లతో భర్తీ చేసేందుకు చర్చించాం.