– జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం.
– మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం.
– నేపాల్ అల్లర్ల నేపథ్యంలో తెలుగు వారిని స్వదేశానికి రప్పించడంలో మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
– విజయదశమి కానుకగా ఆటో సోదరుల ఖాతాలలో 15 వేల రూపాయలు.
– యూనివర్సిల్ హెల్త్ స్కీం ద్వారా ప్రతి ఒక్కరికి 25 లక్షల ఆరోగ్య భీమా కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే..
– చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ఇందుకూరు పేట : అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కే సాధ్యమన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇందుకూరు పేట మండలం జగదేవి పేట గ్రామంలో 50 లక్షలతో నిర్మించిన సిసి రోడ్ల ప్రారంభోత్సవం మరియు మరో యాభై లక్షల నుడా నిధులతో నిర్మించనున్న డ్రైన్ల నిర్మాణాలకు శంఖుస్థాపన కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి జగదేవి పేట కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 50 లక్షల 15 ఆర్ధిక సంఘ నిధులు మరియు NREGS ఫండ్స్ తో నిర్మించిన సిసి రోడ్ల ప్రారంభోత్సవ అనంతరం నుడా ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తో కలిసి జగదేవిపేట గ్రామ పరిధిలో ఆమె 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఆర్ధిక ఇబ్బందులను అధిగమించి తల్లికి వందనం, మత్స్యకారసేవలో, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలు చేశారంటూ సిఎం చంద్రబాబు నాయుడు కార్య దక్షతను కొనియాడారు. నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించి మంత్రి లోకేష్ తన సమర్ధతను నిరూపించుకున్నారన్నారు.