హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనవడు అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీతో కలిసి ఫుట్బాల్ ఆడా రు. రేవంత్ రెడ్డి పక్కన నిలబడి సూచనలు చేస్తూ సరదాగా కాసేపు మనవడితో ఆడించారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్కు కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు. మ్యాచ్ తిలకించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డిని, రాహుల్ గాంధీ పలకరించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మెస్సీకి తెలంగాణ స్వాగతం పలుకుతోందని అన్నారు. “నౌ తెలంగాణ ఈజ్ రైజింగ్, కమ్ జాయిన్ ది రైజ్” అంటూ నినదించారు.