Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి కొడాలి నాని నివాసంలో అభిమానుల కోలాహలం

– నిరాడంబరంగా జరిగిన పుట్టినరోజు వేడుకలు
– భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు
– శుభాకాంక్షలు తెలిపిన అధికార, అనధికార ప్రముఖులు
గుడివాడ, అక్టోబర్ 22: రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పుట్టినరోజు వేడుకలు శుక్రవారం నిరాడంబరంగా జరిగాయి. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసం రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన అభిమానులతో కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికార, అనధికార ప్రముఖులు మంత్రి కొడాలి నానికి పుష్పగుచ్చాలను అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. మంత్రి కొడాలి నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అర్చకులు, చర్చి ఫాదర్లు, మసీదు ఇమామ్ లు వేర్వేరుగా సర్వమత ప్రార్థనలు నిర్వహించి మంత్రి కొడాలి నాని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని, రాజకీయాల్లో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని దేవుడిని ప్రార్థించారు. గుడివాడ డీఎస్పీ ఎన్ సత్యానందం ఆధ్వర్యంలో సబ్ డివిజన్లోని పోలీసు అధికారులంతా మంత్రి కొడాలి నానిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీసుల సమక్షంలో మంత్రి కొడాలి నాని పుట్టినరోజు కేక్ను కట్ చేసి డీఎస్పీ సత్యానందంకు తినిపించారు.
అనంతరం గుడివాడ పట్టణం ఏలూర్ రోడ్డులోని ఫర్నీచర్ పార్క్ లో మంత్రి కొడాలి నానిని పెద్దఎత్తున అభిమానులు ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ ఆర్డీవో జీ శ్రీనుకుమార్, మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్కుమార్, ఆర్టీవో సీతాపతిరావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఆలయ కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్, డ్వామా పీడీ గోర్జి సూర్యనారాయణ, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిణి ఎం సముద్రవేణి, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ పడమట సుజాత, పార్టీ సీనియర్ నాయకులు పాలడుగు రాంప్రసాద్, వల్లూరుపల్లి సుధాకర్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్విక్టర్, నందివాడ మండల అధ్యక్షుడు పెయ్యల ఆదాం, కొండాలమ్మ దేవస్థానం చైర్మన్ కనుమూరి రామిరెడ్డి, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ డైరెక్టర్ ఎన్ మోహన్రెడ్డి, పార్టీ నాయకులు అద్దేపల్లి పురుషోత్తం, అద్దేపల్లి హరిహరప్రసాద్, సయ్యద్ గఫార్, కొంకితల ఆంజనేయ ప్రసాద్, లోయ రాజేష్, గుళ్ళపల్లి శ్రీను, మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి, ఫర్నీచర్ పార్క్ బెనర్జి, గిరి బాబాయ్, చింతల భాస్కరరావు, డొక్కు రాంబాబు, జోగా సూర్యప్రకాశరావు, అడబాల అప్పారావు, సింహాద్రి శివరాంబాబు, బొగ్గరపు తిరుపతయ్య, అల్లూరి ఆంజనేయులు, ముద్దినేని దుర్గానాయుడు, గోవాడ చంటి, మాదాసు వెంకటలక్ష్మి, అల్లం రామ్మోహన్, అల్లం సూర్యప్రభ, షేక్ బాజీ, రహ్మతుల్లా షరీఫ్, షేక్ మౌలాలి, తప్పిట నీలిమ, ఈడే వెంకటేశ్వరమ్మ, ఈడే వెంకటేశ్వరరావు, యేల్చూరి వేణు, తాళ్ళూరి ప్రశాంత్, సునీత, రమీజ, హారిక తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE