రైతుల పక్షాన పోరాటం చేయాలంటే..కల్లాల దగ్గరకు వెళ్లాలన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై గురువారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ నుంచి వ్యవసాయ కమిషనరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఆ తర్వాత వ్యవసాయ కమిషనర్ కు రైతుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కేంద్ర, రాష్ట్ర సర్కార్ లు.. జేఏసీ గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.యి. జేఏసీ అంటే..జాయింట్ ఆక్టింగ్ కమిటీ అని అన్నారు.
ఇందిరా పార్క్ దగ్గర సీఎం కేసీఆర్.. రైతుల పక్షాన ఏం మాట్లాడుతారో అని ఎదురు చూసినమన్నారు.కానీ..ఇందిరా పార్క్ దగ్గర ఏర్పాట్లు చూస్తే.. పరేషాన్ అవుతారన్నారు. ఏసీల్లో కూర్చుని ధర్నాలు చేస్తున్నారని అన్నారు. రైతుల పక్షాన పోరాటం చేయాలంటే.. రైతుల కల్లాల వద్దకు వెళ్లాలని సూచించారు. లేదంటే చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాలన్నారు.
బండి సంజయ్, కిషన్ రెడ్డి..ఢిల్లీకి వెళ్లి మోడీని నిలదీయాలన్నారు రేవంత్ రెడ్డి. సహారా కుంభకోణం లో కేసీఆర్ ను కేంద్రమే కాపాడుతోందన్న ఆయన..నేను చేసిన ఫిర్యాదులు తొక్కిపెడుతున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ. మాట్లాడారు ధాన్యం కుప్పలపై రైతులు పడుకొని అట్లనే చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో.. రైతులు పరేషాన్ అవుతున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను 6 వేల వరకు తెరుస్తామన్న కేసీఆర్ ప్రభుత్వం.. సగం కూడా ఓపెన్ చేయలేదన్నారు. ధర్నా చౌక్ దగ్గర కేసీఆర్ ధర్నా చేయడం సిగ్గు చేటన్నారు. పాలన చేయరాకుంటే.. ఇంటికి పోవాలన్నారు.
వాన కాలం పంట కొనవు.. యాసంగి లో ఏ పంట వేయాలో చెప్పడం లేదని కేసీఆర్ ను ప్రశ్నించారు. ముందు పంటలు కొను.. ధర్నాలు తర్వాత చెయ్ అని అన్నారు షబ్బీర్ అలీ.
వడ్లు కొనకపోతే ఆమరణ దీక్ష చేస్తామని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనకపోతే.. పార్లమెంట్ ని స్తంభింపచేస్తాం అని ఆయన అన్నారు. రాష్ట్రంలోని రైతు సమస్యలే కాంగ్రెస్ పార్టీకి ప్రదానమని ఆయన తేల్చిచెప్పారు. రైతు సమస్యలపైనే తమ కార్యాచరణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ధాన్యాన్ని కొనాలంటూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన ప్రదర్శనలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు జేఏసీగా ఏర్పడినట్లు.. ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీలు జాయింట్ యాక్షన్ డ్రామా చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. డ్రామాలు ఆపి ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనకపోతే కల్లాల నుంచి ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.