తెలంగాణ డిప్యూటీ స్పీకర్, సీనియర్ నేత తీగుళ్ల పద్మారావు జన్మదినం సందర్భంగా, పూరీలోని ఆయన అభిమానులు పద్మారావు సైకత చిత్రం రూపొందించారు. గురువారం ఆయన జన్మదినం సందర్భంగా కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ నేత వారాల వినోద్తో పాటు, అక్కడి స్థానికంగా ఉన్న పద్మారావు అభిమానులు ఇసుకతో పద్మారావు రంగుల చిత్రాన్ని ఏర్పాటుచేశారు. వేరే రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ఈ సైకత చిత్రం ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.